కార్పొరేషన్, నవంబర్ 22: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు పరిశుభ్రమైన నగరాలు, పట్టణాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పట్టణ ప్రగతి పథకానికి అంకురార్పణ చేసింది. అంతేకాకుండా నెలనెలా ఠంఛన్గా నిధులు కేటాయిస్తున్నది. పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో హరితహారం చేపట్టింది. ఈ పథకాల ఫలితాలను అందిపుచ్చుకోని మన బల్దియాలు కేంద్రం ఏటా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ఆయా కేటగిరీల్లో 100లోపు ర్యాంకులు దక్కించుకొంటున్నాయి. లక్ష నుంచి 10 లక్షలలోపు జనాభా ఉన్న నగరాలకు నిర్వహించిన పోటీలో ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు వం దలోపు ర్యాంకులు సాధించాయి. అలాగే దక్షిణ భారతదేశం జోన్లో 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న కేటగిరీలో సిరిసిల్ల నంబర్వన్గా నిలిచింది. మరో 3 మున్సిపాలిటీలు వందలోపు ర్యాంకులు పొందాయి. 25 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల కేటగిరీలో నాలుగు పట్టణాలు వందలోపు స్థానాల్లో నిలువగా.. 25 వేల లోపు జనాభా ఉన్న కేటగిరీలో 6 మున్సిపాలిటీలు 50 లోపే ర్యాంకులు సాధించడం గమనార్హం.
విరివిగా నిధులు..చకచకా పనులు..
తెలంగాణ సర్కారు పట్టణాల సుందరీకరణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. పట్టణ ప్రగతి కింద నెలనెలా జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నది. దీనికింద పారిశుధ్యంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన పార్కు లు, శ్మశాన వాటికలు, ఓపెన్ జిమ్స్, పరిశుభ్రమైన టాయిలెట్స్ తదితర పనులు చేపడుతున్నారు. ఉ మ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీల్లోనూ ప్రతిరోజూ ఇంటింటా చెత్తను సేకరిస్తున్నారు. ఇందుకు మంత్రి కేటీఆర్ చొరవతో స్వచ్ఛ్ ఆటోలను వినియోగిస్తున్నారు. అలాగే రోడ్లను శుభ్రం చేసేందుకు యంత్రాలను వాడుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించి తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరిస్తున్నారు. వెంటవెంటనే డంప్యార్డులకు తరలిస్తున్నారు. పలుచోట్ల రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి వర్మికంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నారు. పొడి చెత్తను డీఆర్సీసీ కేంద్రాలను ఏర్పాటు చేసి శుద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే హరితహారంలో భాగంగా పెద్దసంఖ్యలో మొ క్కలు నాటడమే గాకుండా దాదాపు 85 శాతం మేర మొక్కలను సంరక్షిస్తున్నారు. బల్దియాలే స్వయంగా వన నర్సరీలను ఏర్పాటు చేసుకొని అవసరంమేర మొక్కలను అందుబాటులో ఉంచుకుంటున్నాయి. పట్టణ ప్రగతి నిధులతో అన్ని పట్టణాల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, మంచినీటి పైపులైన్లు అభివృద్ది చేస్తున్నారు.
సిరిసిల్లకు నంబర్ వన్ స్థానం
ఈ యేడు స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలతో పాటు, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, వేములవాడ, రాయికల్, ధర్మపురి, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, చొప్పదండి, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు కూడా ఆయా కేటగిరీల్లో 100లోపు స్థానాలు పొందాయి. సఫాయిమిత్ర సురక్షా చాలెంజ్ పో టీలో జాతీయస్థాయిలో కరీంనగర్ కార్పొరేషన్కు ద్వితీయ బహుమతి దక్కించుకున్నది. లక్ష నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న విభాగంలో 372 నగరాలతో పోటీ పడగా కరీంనగర్కు 3584.71 మార్కులతో 74, రామగుండం 3324.61 మార్కులతో 92వ స్థానాలు సాధించాయి.
దక్షిణ భారత జోన్స్థాయిలో 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో 200 పట్టణాలు పోటీ పడగా 3561.72 మార్కులలో సిరిసిల్ల మొదటి స్థానంలో నిలిచింది. జగిత్యాల 41 (2463.95), మెట్పల్లికి 46(2430. 46), కొరుట్లకు 74 (2280.02) స్థానాలు సాధించాయి.
l 25 నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో సౌత్ ఇండియాస్థాయిలో 319 పట్టణాలు పోటీ పడ్డాయి. వీటిల్లో హుజూరాబాద్ బల్దియాకు 36వ స్థానం (2315.22), వేములవాడకు 48 (2249.38), జమ్మికుంట 71 (2110.24), పెద్దపల్లి 88 (1990.65) స్థానా లు సాధించాయి.