కలెక్టరేట్/విద్యానగర్, జూలై 6: పశువులకు సోకే వ్యాధులపై యజమానులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. నరేందర్ సూచించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెబీస్ నివారణ టీకాను జూలై 6న సర్ లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మనుషులపై ప్రయోగించి విజయవంతమయ్యారని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జునోసిస్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పశువైద్యులను శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు. ఇండియన్ ఇమ్మునోలోజికల్ సంస్థ ఆధ్వర్యంలో పెంపుడు కుక్కలకు ఉచితంగా రెబీస్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పెద్ది విద్యాసాగర్, పశువైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా.వై జయరాం, డా. బీ ప్రకాశ్, డా. ఎస్ లింగారెడ్డి, పశువైద్యాధికారులు డా.కిరణ్, డా.శ్రీకాంత్, డా.శైలజ, డా.హన్నాస్, డా.శ్రీనివాస్, సభ్యులు మెతుకు సత్యం, బొడ్ల కృష్ణ, చిదుర సురేశ్, వేణు, సాయినేని నరేందర్, గుడిసె రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అల్ఫోర్స్ పాఠశాలలో..
కమాన్చౌరస్తా, జూలై 6 : అల్ఫోర్స్ విద్యాసంస్థల సహకారంతో శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం నిర్వహించారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డా. జకని తిరుపతి, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్ రెడ్డి, కార్యక్రమ సమన్వయకర్తలు మధుసూదన్ రెడ్డి, ఎన్ మనోహరాచారి తదితరులు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సత్యనారాయణ రావు, రాంమోహన్ రావు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.