చిగురుమామిడి, జూలై 5: పాల దిగుబడిలో మనమే ముందుండాలని, రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పాడి పరిశ్రమను పెంచి రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. సుందరగిరి గ్రామంలో కరీంనగర్ డెయిరీ బల్ మిల్ కూలింగ్ యూనిట్ను మంగళవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పాడి పరిశ్రమను, రైతులను గత ప్రభుత్వాలు ప్రోత్సహించలేదని, పూర్తిగా విస్మరించాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, రైతులను చైతన్యవంతం చేశారని చెప్పారు.
గోదావరి జలాలతో రైతులు సమృద్ధిగా పంటలు పండిస్తున్నారని, ప్రతి రైతు రెండు పశువులను కొనుగోలు చేసి పాల ఉత్పత్తిని పెంచాలని కోరారు. నెలకు రూ.15 వేల దాకా ఆదాయం పొందే అవకాశం ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసిన పాలను కొనుగోలు చేసేందుకు కరీంనగర్ డెయిరీ సిద్ధంగా ఉందన్నారు. 5 లక్షల లీటర్ల పాల సేకరణను కరీంనగర్ డెయిరీ చేపట్టడం సంతోషకరమన్నారు. మరింత లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. హైదరాబాద్ లాంటి మహానగరానికి గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అమూల్, నంది, ఆరోగ్య, హెరిటేజ్ పాలను సరఫరా చేసుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో మనవద్దే పాల దిగుబడులు పెంచుకుంటే రైతులు అధిక లాభాలు పొందవచ్చని, ఆ దిశగా ముందుకెళ్లాలని సూచించారు. ఎంపీగా ఉన్న సమయంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి 80 కోట్ల దాకా నిధులు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు.
సుందరగిరిలో 10 వేల సామర్థ్యం ఉన్న పాల కూలింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పాల ఉత్పత్తుల కోసం కరీంనగర్ డెయిరీ చేస్తున్న కృషి మరువలేనిదని చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావు, గౌరవ సలహాదారుడు హనుమంత రెడ్డి, ఎండీ శంకర్ రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, గౌరవ సలహాదారుడు హనుమంత రెడ్డి, ఎండీ శంకర్ రెడ్డి, హుస్నాబాద్, గుండ్లపల్లి డివిజన్ డెయిరీ మేనేజర్లు చింతపూల నాగయ్య, కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ శ్రీమూర్తి రమేశ్, ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి, పాల డెయిరీ గ్రామ చైర్మన్ తాళ్లపల్లి సంపత్ గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు సన్నీల వెంకటేశం, సుద్దాల ప్రవీణ్, బోయిని శ్రీనివాస్, చెప్యాల మమత, పెద్దపల్లి భవాని, ముప్పిడి వెంకట నరసింహారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, ఉప సర్పంచ్ జంగా శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము కొమురయ్య, సన్నీల మల్లేశం, మాజీ ఎంపీటీసీ కాశబోయిన నరసయ్య, టీఆర్ఎస్ నాయకులు దిలీప్ కుమార్, మంకు శ్రీనివాస్ రెడ్డి, కొమ్మెర భూపతిరెడ్డి పాల్గొన్నారు.
రైతులు పాడితో ఆదాయం పెంచుకోవాలి
వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమతో రైతులకు భరోసా దొరుకుతుంది. గేదెలను కొనుగోలు చేసి పాల ఉత్పత్తులను పెంచినట్లయితే ఆర్థిక ప్రగతి సాధించవచ్చు. నియోజకవర్గం లో గోదావరి జలాల రాకతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. దీనికి తోడు రైతులు పాడి పశువులను కొనుగోలు చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలి. రాష్ట్ర సర్కారు అన్ని విధాలా సహకారం అం దిస్తున్నది. రైతులను కరీంనగర్ డెయిరీ ప్రోత్సహిస్తూ ఉత్పత్తులను పెంపొందించడం అభినందనీయం.
– ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్