బోయినపల్లి, జూలై 5: చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని 12 గ్రామాల్లో 31 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారుల ఇంటికే వెళ్లి రూ.31,03, 596 లక్షల విలువైన చెక్కులు అందించారు. అలాగే తన సతీమణి దీవెన పంపించిన చీరను సైతం బ్యాగులో పెట్టి ఇవ్వగా, అందుకొని మురిసిపోయారు. కాగా, ఎమ్మెల్యేకు గ్రామగ్రామాన మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి బొట్టు పెట్టి సన్మానించారు.
చక్కెర కుడుకలు పోసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమ్సాగర్రావు, చెన్నాడి అమిత్కుమార్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటటీ కమిటీ సభ్యుడు కొట్టెపల్లి సుధాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్రావు, సర్పంచ్లు కోరేపు నరేశ్, వంగపల్లి సత్యనారాయణరెడ్డి, కందుల కరుణ, కొప్పుల లక్ష్మి, కన్నం మధు, రంగి రేణుక, జూలపల్లి స్వప్నాంజలి, గుడ్ల సుకన్య, ఎంపీటీసీలు కంకణాల వనజ, ఉపేందర్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, టీఆర్ఎస్ నాయకులు పురుషోత్తమ్రెడ్డి, గంగారెడ్డి, స్వామి, కరుణాకర్, తిరుపతి, స్వామి, సంపత్, రాజు, అంజన్రావు, శ్రీను, మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, లక్ష్మీరాజం, శంకర్, సురేందర్రెడ్డి, మధుకుమార్, తిరుపతి, శ్రీనివాస్, అనిల్, సంజీవ్ ఉన్నారు.
పేదలకు అండగా సీఎం కేసీఆర్
రాష్ట్రంలో పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. ఆడ పిల్లల వివాహలు భారం కావద్దని కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెచ్చి సాయం అందిస్తున్నారు. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి మాట్లాడితే వారి కష్ట సుఖాల్లో కూడా పాలు పంచు కోవడానికి అవకాశముంటుంది. అందుకే ఇంటింటికీ వెళ్లి చెక్కులు అందిస్తున్నా.
– ఎమ్మెల్యే సుంకె రవిశంకర్