కొత్తపల్లి, జూన్ 23: కరీంనగర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతూనే స్పోర్ట్స్ సిటీగా రూపొందుతున్నదని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. నగరంలోని అంబేదర్ స్టేడియంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఒలింపిక్ డే రన్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
అంబేదర్ స్టేడియంలోని ఇండోర్లో బ్యాడ్మింటన్ కోర్టు, జిమ్నాసియంతోపాటు పలు క్రీడలకు సంబంధించి శిక్షణ సదుపాయాలు స్మార్ట్ సిటీతో మెరుగైనట్లు పేర్కొన్నారు. క్రీడలను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని, ప్రతి ఒకరూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్ ఒలింపిక్ జ్యోతిని వెలిగించి ఒలింపిక్ డే రన్ ప్రారంభించారు. అంబేదర్ స్టేడియం నుంచి తెలంగాణ చౌక్ మీదుగా తిరిగి స్టేడియం వరకు ఈ రన్ కొనసాగింది. రన్లో సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ వై సునీల్ రావు మాట్లాడుతూ, కరీంనగర్ను అన్ని రంగాలతో పాటు క్రీడాల్లోనూఅభివృద్ధి చేయాలనే సంకల్పంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి డివిజన్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో పాటు నగరవాసులకు అందుబాటులో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్మార్ట్ సిటీలో భాగంగా క్రీడా రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ఒలింపిక్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో ఒలింపిక్ డే రన్ నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు, యువజన శాఖాధికారి రాజవీరు, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయ్కుమార్, సీఐ నటేశ్, రాష్ట్ర బేస్ బాల్ సంఘం అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల రమేశ్ రెడ్డి, సీఏ నిరంజనాచారి, డాక్టర్ రమణాచారి, కోశాధికారి ఎన్ సిద్ధారెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి సమ్మయ్య, అంతర్జాతీయ పారా అథ్లెట్ అంజనా రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు ఎస్ సారయ్య, శంకరయ్య, కడారి రవి, విజయభాసర్ రెడ్డి, బాబు శ్రీనివాస్, ఆనందం, లక్ష్మణ్, ప్రభాకర్, రాజ్ గోపాల్, గిన్నె లక్ష్మణ్, యూనస్ పాషా, వలీపాషా, పీఈటీలు శ్రీలక్ష్మి, శ్రీలత, హరికిషన్, రమేశ్, శ్రీనివాస్, జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు, అయాన్, శాతవాహన సంస్థల శిక్షణార్థులు, వాకర్స్, క్రీడాకారులు పాల్గొన్నారు.
నగరంలోని అల్పోర్స్ ఇ-టెక్నో స్కూల్లో ఒలింపిక్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా కార్యక్రమాన్ని విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి ఒలింపిక్ సంఘం ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రీడల ద్వారా విద్యార్థులకు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. క్రీడలు ఐక్యతకు పునాది వేస్తాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడల్లో రాణించే వారికి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం ప్రతినిధులు గసిరెడ్డి జనార్దన్రెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.