తెలంగాణచౌక్, ఆగస్టు 10: ఇంజినీరింగ్ విద్యా బోధనలో ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. కరీంనగర్ ప్రెస్భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. విద్యాసంస్థల్లోని మూడు బ్రాంచులు కం ప్యూటర్ సైన్స్-ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్స్ ఇంజినీరింగ్తో పాటు మరో బ్రాంచ్కు ఎన్బీఏ గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. ఇది మూ డేండ్లపాటు ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్బీఏ తో పరిశోధనా రంగంలో ఉన్న విద్యార్థులకు ఎం తో ఉపయోగకరమన్నారు. అలాగే, వివిధ రం గాల్లో ఉద్యోగావకాశాలు సత్వరమూ లభిస్తాయ ని, వార్షిక వేతనం కూడా అత్యధికంగా లభిస్తుందన్నారు. ఇప్పటికే జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు వచ్చిందన్నారు. జిల్లాలోనే మొదటిసారిగా న్యాక్ గుర్తింపు రాగా, తాజాగా ఎన్బీఏ గుర్తింపు దక్కడం గర్వకారణమన్నారు.
కళాశాలకు స్వయంప్రతిపత్తి కోసం ద రఖాస్తు చేయగా, ఇప్పటికే జేఎన్టీయూ నిరభ్యంతర పత్రం అందజేసినట్లు చెప్పారు. త్వరలోనే అటానమస్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశా రు. నిబద్ధత కలిగిన మేనేజ్మెంట్, అధ్యాపక బృందం అందిస్తున్న సేవలతోనే జ్యోతిష్మతి వి ద్యాసంస్థలు పురోగమిస్తున్నాయని పేర్కొన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ విశ్వప్రకాశ్ బాబు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.