స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం వన మహోత్సవ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సాహంగా సాగింది. ప్రభుత్వం గ్రామగ్రామాన ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కుల ప్రారంభోత్సవంతో పండుగ వాతావరణం నెలకొన్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటగా దేశభక్తి, హరిత స్ఫూర్తి వెల్లివిరిసింది.
హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 10: మున్సిపల్ పరిధికేసీక్యాంపులోని ఏసీపీ కార్యాలయం వద్ద బల్దియా చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రీడం పార్ ఏర్పాటు చేసి మొకలు నాటారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మలాశ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ డీ ప్రభాకర్, ఇంజినీర్ జీ సాంబరాజు, టౌన్ ప్లానింగ్ అధికారి జ్యోత్స్న, శానిటరీ ఇన్స్పెక్టర్ పీ అనిల్కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన భారీ జాతీయ జెండా ప్రదర్శన ఆకట్టుకున్నది.
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 10: వన మహోత్సవంలో భాగంగా మండలంలోని తుమ్మనపల్లిలో ఎంపీపీ ఇరుమల్ల రాణీసురేందర్రెడ్డి, కాట్రపల్లి గ్రామంలో ఎక్సైజ్ సీఐ దుర్గాభవాని ఆధ్వర్యంలో మొత్తం 1050 మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఏడీఏ సునీత, సర్పంచులు గూడూరి ప్రతాప్రెడ్డి, కాసగోని నిరోషాకిరణ్, ఎంపీవో సురేందర్, పంచాయతీ కార్యదర్శులు సుష్మారెడ్డి, సురేశ్, ఉప సర్పంచ్ బేతి రాజిరెడ్డి, సీఏలు రజిత, శ్రీలత, తిరుమల పాల్గొన్నారు.
సైదాపూర్, ఆగస్టు 10: మండలంలో వన మహోత్సవంలో భాగంగా భారీగా మొక్కలు నాటారు. ఇంటింటికీ జాతీయ పతాకాన్ని పంపిణీ చేశారు. బొమ్మకల్ గ్రామంలోని ఫ్రీడం పార్కులో తహసీల్దార్ సదానందం, ఎస్ఐ ఆరోగ్యం, సర్పంచ్ చిట్టి ప్రత్యూష, ఎంపీడీవో పద్మావతి మొక్కలు నాటారు. వెన్నంపల్లి గ్రామంలో ఫ్రీడం పార్క్ను స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిడి రాంరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ అబ్బిడి పద్మారవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
వీణవంక, ఆగస్టు 10: మండలంలోని చల్లూరులో సర్పంచ్ పొదిల జ్యోతీరమేశ్ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించగా, ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నాయకులతో కలిసి ఎంపీపీ మొక్కలు నాటి దేశభక్తిని చాటారు. మండలంలోని ప్రతి గ్రామంలో రోజువారీగా వజ్రోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో ప్రభాకర్, ఎంపీటీసీ ఎలవేన సవితామల్లయ్య, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, ఆగస్టు 10: మండలంలోని గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. జగ్గయ్యపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కులో జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, ఎంపీపీ దొడ్డె మమత, ఎంపీడీవో సతీశ్కుమార్.. సర్పంచ్ కనపర్తి వంశీధర్రావు, వార్డు సభ్యులతో కలిసి మొక్కలను నాటారు. పట్టణంలో ఉర్డూ మీడియం పాఠశాల ఆవరణతోపాటు కొత్తపల్లిలోని విద్యుత్ సబ్స్టేషన్లో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నాకోటి, కమిషనర్ సమ్మయ్య, టౌన్ సీఐ రాంచంద్రారావు, వార్డు కౌన్సిలర్లు మొక్కలను నాటారు. ఇక్కడ జగయ్యపల్లి ఉప సర్పంచ్ హేమాశంకర్, వార్డు కౌన్సిలర్లు, వార్డు సభ్యులతో పాటు సెక్షన్ ఆఫీసర్ జే బీర్బల్ నాయక్, ఈ సత్యప్రకాశ్, ఏపీవో లోకేశ్వరి పాల్గొన్నారు.
ఇల్లందకుంట, ఆగస్టు 10: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని చాటేందుకు ప్రభుత్వం అట్టహాసంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత, ఎంపీపీ పావని, ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దార్ మాధవి, వైద్యులు జ్యోత్స్న, శ్రీదేవి, ఎంపీటీసీ సంజీవరెడ్డి, ఏపీఎం రమాదేవి, ఎంపీవో వెంకటేశ్వర్లు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.