కార్పొరేషన్, నవంబర్ 25: నగరంలో కొనసాగుతున్న స్మార్ట్సిటీ పనుల్లో వేగం పెంచాలని కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ యాదగిరిరావు అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జ్యోతినగర్లో స్మార్ట్ రోడ్డు, డ్రైనేజీ పనులు, రేకుర్తిలో అండర్ గ్రౌండ్ ఇన్స్పెక్షన్ చాంబర్స్ అభివృద్ధి , నాకా రస్తా జంక్షన్, బ్యాంక్ కాలనీ పారు సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జ్యోతినగర్ వాణీనికేతన్ కాలేజ్ సమీపంలో గల స్మార్ట్ సిటీ రోడ్డు, డ్రైనేజీ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అంతేకాకుండా నాఖా రస్తా జంక్షన్ సుందరీకరణ చివరి దశ పనులను వారంలోగా పూర్తి చేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా గ్రీనరీ, పూల మొకలను పెంచాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. 18 వ డివిజన్ పరిధిలోని రేకుర్తిలో అండర్ గ్రౌండ్ ఇన్స్పెక్షన్ చాం బర్స్ పని పూర్తి చేయాలని కోరారు. నాణ్యతా ప్ర మాణాల ఆధారంగా బిల్లుల చెల్లింపు ఉంటుందనే విషయా న్ని కాంట్రాక్టర్లు గ్రహించాలన్నారు. నగరంలోని బ్యాంకు కాలనీ పారును సుందరంగా తీర్చిదిద్దుతా మన్నారు. నగరంలో టెండర్ ప్రక్రి య పూర్తయిన పలు డివిజన్ పారులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలన్నారు. పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తే బాధ్యులపై చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమాల్లో ఈఈ రామన్, డీఈ వెంకటేశ్వర్, ఆర్వీ ప్రతినిధి దిలీప్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
పదిలోపు ర్యాంకు సాధించాలి..
కరీంనగర్కు స్వచ్ఛ సర్వేక్షణ్లో సాధించిన 74 వ ర్యాంకు నుంచి 10 లోపు వచ్చేలా పారిశుధ్య సి బ్బంది కృషి చేయాలని కమిషనర్ యాదగిరి రావు 35 వ డివిజన్ సప్తగిరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నగరపాలక వెకిహిల్ షెడ్డులో పారిశుధ్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. వంద శాతం చెత్త సేకరణ, తడి పొడి చెత్త వేరు, కంపోస్టు ఎరువుల తయారీ తదితర అంశాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నగర స్వచ్ఛత, పారిశుధ్య పనుల్లో మార్పుపై పలు సలహాలు, సూచనలు చేశారు. స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికులు ఉదయం 6 గంటలకే విధుల్లో ఉండాలని ఆదేశించారు. చెత్తను వేరు చేయడంపై మహిళల కు అవగాహన కల్పించాలన్నారు. మెడికల్ వ్యర్థాలను విడిగా సేకరించాలని సూచించారు. ఎస్ఐ లు, జవాన్లు విధిగా ప్రతి రోజు చెత్త సేకరణ సమయంలో పర్యవేక్షణ చేయాలన్నారు. శానిటేషన్ తనిఖీ సమయంలో చెత్త వేరు చేయకుండా పట్టుబడితే బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుధ్యంపై డివిజన్ల వారీగా స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు స్పష్టం చేశారు. సేంద్రియ ఎరువును తయారు చేసి హ రిత మొక్కలకు అందించాలని సూచించారు. అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్, శానిటేషన్ సూపర్ వైజర్ రాజమనోహార్ పాల్గొన్నారు.