కార్పొరేషన్, జూన్ 4: స్వచ్ఛతలో మరోసారి మన బల్దియాలు మెరిశాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ షహర్ కార్యక్రమంలో భా గంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన పోటీల్లో కరీంనగర్, సిరిసిల్లకు ఉత్తమ పురస్కారా లు వరించాయి. కరీంనగర్ నగరపాలక సంస్థలో 60 డివిజన్లలో 60 ట్రిబులార్ సెంటర్లను ఏర్పా టు చేసి సాలిడ్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నందు కు ఈ అవార్డులు దక్కాయి. లక్షకు పైబడిన జ నా భా ప్రాతిపదిక ఐదు నగరాలు ఈ అవార్డుకు ఎం పిక కాగా కరీంనగర్కు మొదటి స్థానం దకింది. ఈ అవార్డును సోమవారం హైదరాబాద్లో పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతులమీదుగా బల్దియా కమిషనర్ సేవా ఇస్లావత్ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రక్రియను పాటించాలన్నా రు. రెడ్యూజ్ రీయూజ్ రీసైకిల్ విధానాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని తెలిపారు. అవార్డు ఎంపికకు సహకరించిన నగర ప్రజలకు, పాలకవర్గ సభ్యులకు, అధికారులకు, పారిశుధ్య సిబ్బంది కార్మికులకు, మెప్మా మహిళా సిబ్బంది కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 4: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన పోటీల్లో 50 వేల నుంచి లక్షలోపు జనాభా కలిగిన ము న్సిపాలిటీల్లో సిరిసిల్ల మున్సిపల్ ఉత్తమ మున్సిపాలిటీ అవార్డుకు ఎంపికైంది. ప్లాస్టిక్ నిర్మూలన, బర్తన్ బ్యాంకుల ఏర్పాటు, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా తడి, పొడి చెత్త నిర్వహణ(డీఆర్సీసీ), సేంద్రియ ఎరువును తయా రు చేయడం, కమ్యూనిటీ అందుబాటులో ఉన్న, లేని వార్డులలోనూ ఆర్ఆర్ఆర్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటు, మేరీ లైఫ్ మేర స్వచ్ఛ షహర్లో భా గంగా చైతన్య కార్యక్రమాల నిర్వహణ విభాగాలలో ఈ అవార్డుకు ఎంపికైంది. సోమవారంహైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అవార్డును అందించనున్నారు. కాగా, అవార్డు రావడంపై బల్దియా అధికారులు, పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.