ఐటీడీఆర్ త్వరలోనే ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 272 దరఖాస్తులు
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో శిక్షణతోపాటు ఉపాధి
సిరిసిల్ల రూరల్, మార్చి 29 : మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో ఏర్పాటైన అంతర్జాతీయ డ్రైవింగ్ ట్రైనింగ్, రీసెర్చ్ సెంటర్ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. 20 ఎకరాల్లో 20 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రాక్లు, ఆధునిక ల్యాబ్ సిమిలెటర్స్ ఏర్పాటు చేశారు. తొలి విడుతగా ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్న 60 మందికి శిక్షణ దివ్వనున్నారు. వీరికి 90 రోజుల పాటు హెవీ మోటర్ వెహికల్పై శిక్షణ అందించి, సర్టిఫికెట్ అందించనున్నారు.
త్వరలోనే ప్రారంభం..
ఐడీటీఆర్లో శిక్షణ కోసం ఇటీవలే జిల్లా గ్రామీ ణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహ్వానించగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 272 వచ్చాయి. ఇందులో ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్నవారు 114 మంది దరఖాస్తు చేసుకోగా, మిగిలిన వారి లో పదో తరగతి పూర్తి చేసిన నిరుద్యోగ యువత ఉన్నారు. శిక్షణతోపాటు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మొదట ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్న 60 మం దిని ఎంపిక చేసి, వారికి 90 రోజుల పాటు శిక్షణ అందిస్తారు. అనంతరం వారికి ఉపాధి కల్పించనున్నారు. తర్వాత దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ విడుతల వారీగా శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పించనున్నట్లు డీఆర్డీవో పీడీ కౌటిల్యారెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని యువకులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.