సెలూన్లు, ధోబీఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ ప్రకటనపై హర్షం
సంబురాలు జరుపుకొన్న రజక, నాయీబ్రాహ్మణ కులస్తులు
కార్పొరేషన్, ఏప్రిల్ 5: నాయీబ్రాహ్మణుల సెలూన్ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయాన్ని కల్పించినందుకు నగరంలోని 11వ డివిజన్ కార్యాలయంలో నాయీబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ చిత్రపటాలకు సోమవారం పాలాభిషేకం చేశారు. కార్పొరేటర్ ఆకుల నర్మదానర్సయ్య, నాయకులు జంపాల భిక్షపతి, అంజి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సెలూన్లు, లాండ్రీ షాపులు, ధోబీఘాట్లకు 250 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా అందించాలని నిర్ణయించడంపై అల్గునూర్ 8వ డివిజన్ కార్పొరేటర్ సల్లా శారదారవీందర్, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం, మంత్రి గంగుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆయా సంఘాల నాయకులు యాస్వాడ ఆంజనేయులు, తొర్తి సత్తయ్య, టీఆర్ఎస్ నాయకులు దుండ్ర రాజయ్య, జాప శ్రీనివాస్రెడ్డి, సల్లా మహేందర్, కంది రాంచంద్రారెడ్డి, జాప రవీందర్రెడ్డి, రాఘవరెడ్డి, అనోహర్, రమేశ్, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీనివాస్, శంకర్, మల్లేశ్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి, ఏప్రిల్ 5: రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణుల క్షౌరశాలలు, లాండ్రీలు, ధోబీఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించగా ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు మండలంలోని తెలంగాణ చౌరస్తావద్ద సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీగాధ నారాయణ మాట్లాడారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. గౌరవాధ్యక్షుడు శ్రీగాధ గట్టయ్య, ఉపాధ్యక్షుడు గర్షకుర్తి రమేశ్, సభ్యులు శ్రీగాధ నారాయణ, శ్రీగాధ లక్ష్మణ్, శ్రీగాధ సాగర్, గర్శకుర్తి కనకయ్య, శ్రీగాధ సత్తయ్య, శ్రీగాధ కోటి, శ్రీగాధ కనకయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 5: ఇరుకుల్లలోని రజక, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆయా సంఘాల నాయకులు తంగళ్లపల్లి ప్రసాద్, అందూర్తి ప్రకాశ్, నేదునూరి మహేశ్, నేదునూరి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..