జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో అంధత్వ నివారణ కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. పట్టణంలోని 45వ వార్డులోని వైశ్యభవన్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించి, శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 100 వారాల పాటు కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పట్టణంలో తొమ్మిది బృందాలు పనిచేస్తున్నాయని, ఒకొక బృందం రోజుకు 200 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నదని తెలిపారు. బస్తీ, పల్లె దవాఖానల ఏర్పాటు ద్వారా ప్రజల వద్దకే మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలో జిల్లా ప్రధాన దవాఖానలో సీటీ సాన్ను ప్రారంభించి, క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, కౌన్సిలర్లు బొడ్ల జగదీశ్, కప్పల శ్రీకాంత్, చాంద్ పాషా, వైశ్య సంఘం అధ్యక్షుడు మంచాల కృష్ణ, కమిషనర్ డాక్టర్ నరేశ్, ఏవో శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు దామోదర్ రావు, నాయకులు ఆనంద్ రావు, గిరి, సమిండ్ల శ్రీనివాస్, దాసరి ప్రవీణ్, అడువాల లక్ష్మణ్, సుభాష్, రామ్మోహన్ రావు, లవంగ రాజేందర్, కొలగాని సత్యం, సింగరావు, దుమాల రాజ్ కుమార్, మేక పవన్, బట్టు ప్రవీణ్, వంశీ బాబు, వేణు మాధవ్, భోగ అరవింద్, పెందెం గంగాధర్, అజీమ్, రవి, రహమాన్, మహేశ్, వైద్యాధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.