కోరుట్ల రూరల్, డిసెంబర్ 20: కోరుట్ల ఎమ్మెల్యేగా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు త్వరలో కృతజ్ఞత, అభినంద సభను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు తెలిపారు. బుధవారం కోరుట్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. కృతజ్ఞత సభను జయప్రదం చేయాలని, అందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, అదే విధంగా భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులతో చర్చించారు. సమావేశంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, కోరుట్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు అన్నం అనిల్, నాయకులు దారిశెట్టి రాజేశ్, రమేశ్, నేమూరి సత్యనారాయణ, గడ్డం మీది పవన్ తదితరులు పాల్గొన్నారు.