Garrepalli | సుల్తానాబాద్ రూరల్, జూలై 24 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా కల్లేపల్లి జానీ శుక్రవారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. సభ్యులుగా రమేష్, రాజశేఖర్ రెడ్డి, రాజిరెడ్డి, రమ, రాజిరెడ్డి, చక్రధర్, సరోజన, రాజు, తిరుపతి, రాజమల్లు, స్వరూప, పెద్ద రాజయ్య బాధ్యతలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ జానీ మాట్లాడుతూ అందరి సహకారంతో సంఘం సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. రైతుల అభ్యున్నతికి పాటు పడతానన్నారు. అనంతరం చైర్మన్ తో పాటు పాలకవర్గాన్ని పలువురు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఈవో నవీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.