ఎల్లారెడ్డిపేట, మే 26: రెండేండ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కెనాల్ నిర్మాణ పనుల కోసం తెప్పించిన ఇసుక, కంకర మాయమైందని కాంట్రాక్టర్ జేబీ, నిర్మాణ సంస్థకు సంబంధించిన ఇంజినీర్ వేణు ఆరోపించారు. ఆదివారం ఖాళీ అయిన డంపును చూసి ఇంజినీర్ వేణు వివరాలు వెల్లడించారు.
రూ.6.50 లక్షల విలువైన కంకర, రూ.లక్ష విలువైన ఇసుక స్థానికులే అమ్ముకున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు సైతం తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఇదివరకే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో లక్షల్లో మోసపోయామని ఆవేదనగా తెలిపారు. ఇప్పటికైనా ఇసుక, కంకర మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.