చందుర్తి, ఫిబ్రవరి 7: జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్రావు పుట్టినగడ్డపై మరోసారి మమకారం చాటుకున్నారు. మండలంలోని మూడపల్లిలో సోదరుడు ఆనంద్రావు స్మారకార్థం రూ. 4 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు. గతంలోనూ తల్లిదండ్రుల పేరిట గ్రామంలో వాటర్ ప్లాంట్ను అందుబాటులోకి తెచ్చారు.
సర్కారు బడిలో మౌలిక వసతులు కల్పించారు. కాగా, గ్రామంలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడంపై మాజీ సర్పంచులు చిలుక అంజిబాబు, సంటి బాబురావు, సంటి ఏసుదాస్ సాగర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.