చొప్పదండి, ఏప్రిల్ 14: అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్, తహసీల్దార్ రజిత, ఎంపీడీవో స్వరూప, ఎంపీటీసీలు బత్తుల లక్ష్మీనారాయణ, గొల్ల సునంద, కౌన్సిలర్లు సంధ్య, కొత్తూరి మహేశ్, స్వతంత్ర భారతి, నలుమాచు జ్యోతి, రహమాన్ పాషా, దళిత ఉద్యోగులు అంజయ్య, భూమయ్య, రత్నం, రాజయ్య, రాజలింగం, శ్రీధర్, కనకయ్య, శంకర్, గంగరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి కొంకటి శేఖర్, నాయకులు నలుమాచు రామకృష్ణ, కొత్తూరి నరేశ్, మచ్చ రమేశ్, మహేశుని మల్లేశం, సీపెల్లి గంగయ్య, సదానందం, శ్రీనివాస్, బీమా, విక్రమ్, అనిల్, హరీష్, అరవింద్, నరేశ్ రావణ్, తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, కమిషనర్ శాంతికుమార్, కౌన్సిలర్లు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచులు, ఎంపీటీసీలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మంగళపల్లెలో సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి, ఎంపీటీసీ వెల్మ విజయలక్ష్మి-శ్రీనివాస్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపు మేరకు రేవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బందారపు అజయ్కుమార్ గౌడ్ మొక నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని యువత మొకలు నాటాలని పిలుపునిచ్చారు.
గంగాధర, ఏప్రిల్ 14: మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, అంబేద్కర్ సంఘ భవనాల్లో సంఘం నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. గంగాధరలో అంబేద్కర్ సంఘం నాయకులు ర్యాలీ తీశారు. స్థానిక శ్రీనిధి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ తీసి, చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రామడుగు, ఏప్రిల్ 14: బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో జయంత్యుత్సవ కమిటీ చైర్మన్ లంక మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆయన సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేశారు. ఉత్సవ కమిటీ సహకారంతో పలువురికి అంబేద్కర్ ప్రతిమలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులతోనే సమాజంలో తలెత్తుకొని జీవిస్తున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, వెలిచాలలో అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ వీర్ల సరోజన పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మీపూర్లోని అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ చిలుముల రజిత-ప్రభాకర్, ఎస్ఐ అంజయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కలిగేటి కవిత-లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెన్న రాజమల్లయ్య, శేఖర్, అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
హౌసింగ్బోర్డుకాలనీ, ఏప్రిల్ 14: బీఆర్ఎస్ నాయకుడు గట్టెపల్లి దిలీప్కుమార్ ఆధ్వర్యంలో యువకులు బైక్ ర్యాలీ తీశారు. ర్యాలీ అల్గునూర్ చౌరస్తా వద్ద ప్రారంభమై ఎల్ఎండీ కాలనీ, మహాత్మానగర్, సుభాష్నగర్, ఇందిరానగర్, నుస్తులాపూర్ వరకు చేపట్టారు. గట్టెపల్లి దీపక్ కుమార్, జిల్లెల్ల ఉదయ్కిరణ్, గట్టెపల్లి రాజ్కుమార్, కటకం అభిచరణ్, బందెల సిద్ధార్థ్, సొల్లు సాయికుమార్, సృజన్కుమార్, సిరిసిల్ల చందు, కన్నం సోను, అరవింద్, సిరిసిల్ల నవీన్, మోదుపల్లి తిరుపతి, అలువాల వికీ, అంబేదర్ యువజన, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 14: కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చామనపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచ్ బోగొండ లక్ష్మి, ఉపసర్పంచ్ దావు నిర్మల, ఐలయ్య, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చామనపల్లి మల్లయ్య, హనుమంతు, వెంకటేశ్వర్లు, సింగిల్ విండో డైరెక్టర్ గంట శంకరయ్య, దావు రాజిరెడ్డి, మహిపాల్రెడ్డి, దుబ్బపల్లి, చామనపల్లి ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. చెర్లభూత్కూర్లో అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కవ్వంపల్లి అంజయ్య, తిరుపతి గౌడ్, కూర శ్యాంసుందర్ రెడ్డి, ఆకుల సుజాత, మోక్షిత్, హనుమంత్రావు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. చేగుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ చామనపల్లి అరుణ-రాజయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపసర్పంచ్ గాండ్ల విజయ, సింగిల్ విండో డైరెక్టర్ గాండ్ల అంజయ్య, వార్డు సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, ఆశ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఎలబోతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ కట్ల లక్ష్మి పూల మాల వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీ చల్ల రామక్క-లింగారెడ్డి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అలాగే, అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నర్సయ్య, ఎంపీటీసీ రామక్క-లింగారెడ్డి, ధర్మయ్య, శ్రీను, మహేశ్, కొమురయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. దుర్శేడ్లో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు న్యాతరి శ్రీధర్ ఆధ్వర్యంలో యువకులు అంబేద్కర్ జెండా ఎగురవేశారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు, సింగిల్ విండో డైరెక్టర్ తోట తిరుపతి, గాజుల అంజయ్య, కార్యదర్శి సుష్మిత, అశోక్, బెజ్జంకి రాములు, కుమార్, రాజ్కమల్, బోగ తిరుపతి, గాలిపెల్లి ప్రవీణ్, శనిగరం మనోజ్కుమార్, గాజుల రాజు, సుభాష్, అరవింద్, న్యాతరి నవీన్ పాల్గొన్నారు. నగునూర్ గ్రామ పంచాయతీ కార్యలయంలో అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ ఉప్పు శ్రీధర్ పూల మాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సంఘం సభ్యుడు దావు సంపత్కుమార్, పంచాయతీ కార్యదర్శి మల్లయ్య, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు సాయిల వినయ్కుమార్, అంకమల్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ దామోదర్ రెడ్డి, వార్డు సభ్యులు కస్తూరి అపర్ణ, బోకూరి వనిత, మల్లారెడ్డి, దావు తిరుపతమ్మ, కల్లెపెల్లి బాబు, బోనగిరి హన్మంతరావు, పెంచాల అరుణ్కుమార్, కోట నారాయణ, తాటికొండ వెంకటమ్మ, స్వప్న, పెరుపు రమేశ్, ఏగుర్ల కోమలత, కనకట్ల లత, కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ హఫీజ్, పూసాల సుభాషిణి, కార్యదర్శి మల్లయ్య, కారోబార్ ఫారూక్, నరహరిరావు పాల్గొన్నారు. మొగ్దుంపూర్లోని అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ జక్కం నర్సయ్య, తహసీల్దార్ నారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాండ్ర అంజన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పుస్తకాలు పంపిణీ చేశారు. జడ్పీటీసీ పురుమల్ల లలిత, ఎంపీటీసీ పుష్ప, ఉపసర్పంచ్ తిరుపతి, వార్డు సభ్యులు పాలకొండ రజిత, మీసాల రజిత, మీసాల మహేశ్వరి, పోతర్ల క్రాంతి, రామకృష్ణ, మీసాల శంకర్, మీసాల గంగారాం, మీసాల వేణు, మీసాల రాజేశ్వరి, వేణు, తిరుపతి, లింగపల్లి గిరిప్రసాద్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. గోపాల్ఫూర్ గ్రామ పంచాయతీ కార్యలయంలో అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ ఊరడి మంజుల-మల్లారెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. వైస్ ఎంపీపీ నారాయణ, ఉపసర్పంచ్ ఆరె శ్రీకాంత్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 14: కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయం నుంచి మండలంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్కు తరలివెళ్లారు. తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. నాయకులు ఎల్కపల్లి చంద్రమోహన్, రాజ్కమల్, బుచ్చల కొమురయ్య, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోష్కి శంకర్, శంకర్, తప్పట్ల నరేశ్, ఏఎంసీ డైరెక్టర్ కుమార్, మీసాల సురేశ్, తదితరులు ఉన్నారు.
ముకరంపుర, ఏప్రిల్ 14: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి చైర్మన్ రెడ్డవేని మధు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎస్ఈ వీ గంగాధర్ పూలమాల వేసి నివాళులర్పించారు. డీఈలు తిరుపతి, కాళిదాసు, ఏవో రాజేంద్రప్రసాద్, అరవింద్, ఏడీఈలు, ఏవోలు, పీవో, ఏఈలు, అసోసియేషన్ నాయకులు కిరణ్కుమార్, ఆనంద్, తిరుపతి, శ్యామయ్య, రత్నం, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఏప్రిల్ 14: కొత్తపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, అంబేద్కర్ సంఘం నాయకులు, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, యువజన సంఘం నాయకులు, పట్టణవాసులు పాల్గొన్నారు. ఆసీఫ్నగర్లో అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ కడారి శాంత-శ్రీనివాస్, ఎంపీటీసీ దావ కమల మనోహర్, సత్యవర్ధన్, భానువర్ధన్, విష్ణువర్ధన్, దుర్గం శ్రీహరి, రెడ్డవేని నాగన్న, పెరుక లక్ష్మణ్రావు, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని టీఎన్జీవో కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఎన్జీవోస్ నాయకులు కిరణ్కుమార్రెడ్డి, రాగి శ్రీనివాస్, మారుపాక రాజేశ్, రామస్వామి, కేశవరెడ్డి, లక్ష్మీనారాయణ, వెంకట్, రవీందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, నగేష్గౌడ్, రమేశ్గౌడ్, రాజేశ్వరరావు పాల్గొన్నారు. నెహ్రూ యువకేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ లావణ్య, ఎన్వైకే ప్రోగ్రాం అధికారి రవీందర్, లెక్చరర్లు శ్రీనివాస్, సంతోష్, రూప, స్వప్న, వలంటీర్లు సాయిచరణ్, సింధు తదితరులు పాల్గొన్నారు. కృషియూత్ ఆధ్వర్యంలో రేకుర్తి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రయ్య, సురేశ్, లింగమూర్తి, శ్రీనివాస్, బాలకృష్ణ, రేవంత్, దుర్గం శ్యాంసుందర్, కిరణ్కుమార్ పాల్గొన్నారు. కొత్తపల్లి ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు అధికారులు హైదరాబాద్లో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలివెళ్లారు.