ధర్మపురి : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం భక్తుల సందడి కనిపించింది. భాద్రపద పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానాలు ఆచరించారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారికి కోరమీసాలు, తులాభారం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.