హైదరాబాద్ : పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో జగిత్యాల జిల్లా జడ్పీ చైర్మన్ దావ వసంతసురేష్(Dava Vasantha) , జడ్పీటీసీ సభ్యులు, జిల్లా నాయకులు గురువారం కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర(New Year) శుభాకాంక్షలు తెలిపారు.
జడ్పీచైర్పర్సన్ దావ వసంత సురేష్పై వస్తున్న అవిశ్వాస తీర్మానం(Motion of no confidence) పూర్తి అబద్దమని , పూర్తి పదవికాలం పాటు ఆమెనే కొనసాగుతారని జడ్పీటీసీలు కేటీఆర్కు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) బీఆర్ఎస్(BRS) అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జడ్పీ చైర్మన్, జిల్లా పరిషత్ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.