జగిత్యాల : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో (SKNR) ఈ నెల 31వ తేదీన డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించుచున్నట్లు డా. జి.వెంకట్ రాజిరెడ్డి, డా. పి. తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2021 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, తెలుగు భాష పై పట్టు ఉండి, ఇంగ్లీష్ భాషపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలన్నారు.
18 – 20 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి డా. రెడ్డీస్ లాబోరేటరీస్ వారు బిట్స్ పిలాని హైదరాబాద్లో డిగ్రీ చదివిస్తూ (ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఉద్యోగ అవకాశం కల్పిస్తారన్నారు. తగిన వేతనం కూడా ఇస్తారని వారు పేర్కొన్నారు.
ఆసక్తి గల విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్ మెమోలతో పాటు ఆధార్ కార్డు వంటి పత్రాలతో ఖచ్చితంగా కొవిడ్ నిబంధనలకు లోబడి హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9989292009, 9963117456 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.