ఇబ్రహీంపట్నం : తుది శ్వాస వరకూ కార్యకర్తలకు అండగా ఉంటానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ మండల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మండల కార్యవర్గం, అనుబంధ కమిటీలు, గ్రామ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడిగా ఎలాల దశరథరెడ్డి, కార్యదర్శిగా నేమూరి సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడిగా నేమూరి నరేశ్, బీసీ సెల్ అధ్యక్షుడిగా చల్ల దేవదాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా విజయ్నాయక్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడిగా మహ్మద్ యాసిన్, రైతు విభాగం మండలాధ్యక్షుడిగా ఎలిసె శాంతాభూషణ్, కార్మిక విభాగం మండలాధ్యక్షుడిగా నవ్వత్ రాజేందర్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడిగా బట్టు శేఖర్, అలాగే 17 గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, తన రాజకీయ భవిష్యత్తు ఇబ్రహీంపట్నం మండలం నుంచి ప్రారంభమైందని, తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం టీఆర్ఎస్ యువ నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును, ఆయన తనయుడు డాక్టర్ సంజయ్ను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు జంగద్యావతి సరస్వతి, వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుగుణాకర్ రావు, సర్పంచ్ నేమూరి లత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పొన్కంటి వెంకట్, సింగిల్ విండో చైర్మన్లు బాస శ్రావణ్, బద్దం గోపి, అంకతి రాజన్న, మాజీ ఎంపీపీలు నేరెళ్ల దేవేందర్, పుష్పలత, నాయకులు జగన్ రావు, కంటం రమేష్, ప్రదీప్ కుమార్, పురుషోత్తం, జెడి సుమన్, చిన్నారెడ్డి, భూమేష్, తుకారాం, ఆనంద్, ద్యావతి సుదర్శన్, గూడ పాపాన్న, అల్లూరి రఘుపతి రెడ్డి, ఆనంద్, రాజేందర్, దేవన్న, సత్యం, నర్సాగౌడ్, జీవన్, శేఖర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.