కోరుట్ల రూరల్, నవంబర్ 24: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రూ.45లక్షల వ్యయంతో నిర్మిస్తున్న చైర్మన్ గది, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గురువారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని పేర్కొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలన్నారు. రైతుల సౌకర్యార్థం పట్టణ శివారులోని కోనారావుపేట రహదారిలో ఐదెకరాల భూమిని కేటాయించి ప్రహరీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, జిల్లా సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీద పవన్, డీసీఎంఎస్ డైరెక్టర్ ఎలిశెట్టి భూంరెడ్డి, జిల్లా సహకార సంఘాల ఫోరం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నర్సారెడ్డి, టీ(బీ)ఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు కాశిరెడ్డి మోహన్ రెడ్డి, గ్రంథాలయ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ల సురేశ్గౌడ్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
కోరుట్ల, నవంబర్ 24: స్వరాష్ట్రంలో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన అందుతుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. పట్టణంలోని కల్లూరు రోడ్డు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం సత్యసాయిబాబా 97వ జయంతిని పురస్కరించుకొని సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహర పానీయ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్ని సౌకర్యాలు గల ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం విద్యాశాఖ విద్యార్థులకు మంజూరు చేసిన స్కూల్ యూనిఫామ్స్, టై బెల్ట్, ఐడీ కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అయాజ్, జిల్లా సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడెల భూపతి, అధ్యాపకులు, కౌన్సిలర్లు, టీ(బీ)ఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.