జగిత్యాల : జిల్లాలో దారుణం చోటు చేటు చేసుకుంది. అనుమానం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. సారంగాపూర్ మండలంలోని రేచపల్లి శివారులోని లచ్చానాయక్ తండా గ్రామానికి చెందిన భూక్యా లక్ష్మణ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
లక్ష్మణ్కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భూక్యా సురేందర్ మరో ఇద్దరు కలిసి తెల్లవారు జామున భూక్యా లక్ష్మణ్ను బండరాళ్లతో తలపై కొట్టి హత్య చేశారు. సంఘటన జరిగిన స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ కృష్ణ కుమార్, సారంగాపూర్, రాయికల్ ఎస్ఐలు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.