జగిత్యాల కలెక్టరేట్/ మెట్పల్లి జనవరి 10: జగిత్యాల జిల్లాలో అనుమతుల్లేని ఫైనాన్స్, చీటి దందాలు చేసే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రూ.30,24,800 విలువైన నాన్ జ్యుడీషియల్ బాండ్ పేపర్లు, 272 ప్రామిసరీ నోట్లు, 14 చెక్ బుక్కులు, 54 ఖాళీ చెక్కులు, 19 సేల్ డీడ్ డాక్యుమెంట్లు, 8 వ్యవసాయ పట్టాదారు పాసుపుస్తకాలు, 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల ఎస్పీ సింధూశర్మ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం జగిత్యాల, కోరుట్ల, మెట్పెల్లిలో పోలీసులు ఏకకాలంలో దాడులు జరిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పాపున్క శ్రీనివాస్ ఇంటిలో 19.60లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, 11 చెక్ బుక్స్, 11 బాండ్ పేపర్లు, 18 ఖాళీ చెక్కులు, 22వేల నగదు, గాండ్ల వెంకన్న ఇంటిలో 21.60లక్షల నగదు, కోరుట్లలో జగన్నాధం 60వేల నగదు, 6ప్రామిసరీ నోట్లు, 4సేల్ డీడ్స్, 6 పట్టాదార్ పాసుపుస్తకాలు, దాసరి రాము ఇంట్లో 40వేల నగదు, 49 ప్రామిసరీ నోట్లు, 18 చెక్కులు, 4 సేల్ డీడ్లు, బింగి వెంకటేశ్ ఇంట్లో 22 ప్రామిసరీ నోట్లు, నల్ల రవి ఇంటిలో 2.47 లక్షల నగదు, కొడిపె రాజేంద్రప్రసాద్ ఇంట్లో 7ప్రామిసరీ నోట్లు, 7 చెక్కులు, మేడిచర్ల మురళి ఇంట్లో 5.17లక్షల నగదు, మెట్పెల్లిలోని పూసల లక్ష్మీరాజం ఇంట్లో 29 ప్రామిసరీ నోట్లు, ఏనుగు రాజేశ్వర్ రావు ఇంట్లో నాలుగు ప్రామిసరీ నోట్లు, బొప్పరాతి లక్ష్మన్ ఇంటిలో 61 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గతంలో సైతం పలుమార్లు చేసిన దాడుల్లో తెలంగాణ మనీ నెండర్ ఆక్టు కింద 14 కేసులు నమోదు చేయగా, 10 మందికి జిల్లా కలెక్టర్ 9.50లక్షల జరిమానా విధించారన్నారు. ఈ తనిఖీల్లో జగిత్యాల, కోరుట్ల, మెట్పెల్లి సీఐలు కిశోర్, రాజశేఖర్రాజు, ఎల్. శ్రీను, ఎస్ఐలు సదాకర్, సతీశ్ పాల్గొన్నారు.