‘తారక రాముడి’ ప్రకృతి వనం
జగిత్యాల, జూలై 24: జగిత్యాల బల్దియా ఆధ్వర్యంలో యాదాద్రి మోడల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం తీరొక్క మొక్కలతో ఆకట్టుకుంటున్నది. పడావుపడ్డ భూమిని అభివృద్ధి చేసి నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో హరిత శోభను సంతరించుకున్నది. మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి ఇక్కడి ప్రకృతి అందాలను ఫోన్లో బంధించి మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా పంపించారు. ఇటీవల మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ ఇక్కడి ప్రకృతివనాన్ని సందర్శించారు. ఇక్కడి రమణీయ దృశ్యాలను చూసి బల్దియా పాలకవర్గాన్ని మెచ్చుకున్నారు. ‘తారకరామ ప్రకృతి వనం’ అని నామకరణం చేశారు. కాగా, కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం ప్రకృతివనాన్ని ప్రారంభించారు