కన్నతల్లిలాంటి పార్టీని మోసం చేసిండు
టీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నిండు
పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఇక్కడ అభివృద్ధి చేయలేదు
సీఎం కేసీఆర్ ప్రజల మనసెరిగిన మహానాయకుడు
కేసీఆర్ను విమర్శిస్తే రాజకీయ సమాధి చేస్తం.. జాగ్రత్త
జమ్మికుంటలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
జమ్మికుంట, ఆగస్టు 19 : ‘ఇరవై ఏళ్లుగా ఇక్కడి దళిత, బహుజనులను ఇబ్బందులకు గురి చేసినవ్. పార్టీని నిర్వీర్యం చేసేందుకు అభివృద్ధి చేయలేదు. కన్నతల్లిలాంటి పార్టీని మోసం చేసినవ్. కొడుకులా చూసుకున్న కేసీఆర్ను వెన్నుపోటు పొడిచేందుకు కుట్రలు పన్నినవ్. రెండేళ్ల కిందట్నుంచే బీజేపీతో చేతులు కలిపినవ్. కుమ్మక్కైనవ్. ప్రభుత్వ పథకాలన్నీ పరిగె అంటవా. దళిత బంధును అవహేళన చేస్తవా. దళిత, బహుజనుల భూములు లాక్కున్నవ్. లెఫ్టిస్టో.. సోషలిస్టో కాదు.. ఆయనో పెద్ద కరెప్షనిస్టు. గడియారాలు, కుట్టు మిషన్లు, పైసలు పంచడమా..? నీ ఆత్మ గౌరవం. ప్రజలే తగిన గుణపాఠ చెప్తరు. సీఎం కేసీఆర్ మీదనే విమర్శలు చేస్తవా.. జమ్మికుంట చౌరస్తాలో రాజకీయ సమాధి చేస్తం జాగ్రత్త..’ అంటూ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్పై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఫైర్ అయ్యారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని లయోలా స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్లో పదవులన్నీ అనుభవించి, పార్టీకి ఎందుకు రాజీనామా చేశావో..? చెప్పాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలకు పాల్పడితే విచారణ చేయమన్నందుకే వెళ్లిపోతావా? అని ప్రశ్నించారు.
మెడికల్ కాలేజీ పర్మిషన్ కోసం బీజేపీ వద్ద నాడే మోకరిల్లాడని గుర్తు చేశారు. ఆరుసార్లు బీ ఫారం ఇచ్చి గెలిపించిన సీఎం కేసీఆర్ను వెన్నుపోటు పొడిచేందుకు కుట్రలు పన్నాడని ఆరోపించారు. సన్నాసులుండే పార్టీలో చేరాడని, ఆస్తులు, అధికారం కోసం ఆరాటపడుతున్నాడని ధ్వజమెత్తారు. మంత్రిగా ఉంటూనే శత్రువులతో చేతులు కలిపిన విషయాలను వివరించారు. ఆత్మ గౌరవం అంటే ఏందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఆత్మ గౌరవం ఉంటే ప్రజలను ఎందుకు ప్రలోభాలకు గురి చేశావో? చెప్పాలన్నారు. పదవనే ఉచ్చులో ఇష్టానుసారంగా మాట్లాడుతూ పైశాచికానందం పొందుతున్నాడని మండిపడ్డారు. దళిత బంధు తన వల్లనే వచ్చిందంటూ.. సన్మానం చేపించుకుంటున్నాడని, మరి ఆసరా, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఎన్నో పథకాలు ఆయన వల్లనే వచ్చాయా..? చెప్పాలని డిమాండ్ చేశారు. సంవత్సరం క్రితమే సీఎం దళిత బంధుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
బీజేపీలో నిఖార్సైన నాయకుడివైతే.. భద్రాచల రాముడి గుడి వద్దకు రైల్వే లైన్ వేయించాలని, అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీసీతారామస్వామి దేవస్థానం అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేంద్రం నుంచి మంజూరు చేపించాలని డిమాండ్ చేశారు. ప్రచారంలో మోదీ పేరు, ప్రలోభాల వస్తువులపై మోదీ బొమ్మను ఎందుకు వాడడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యక్తిగతం కోమే రాజకీయం చేస్తున్న విషయాలను బీజేపీ గమనిస్తున్నదని చెప్పారు. నియోజకవర్గానికి వస్తే బీసీగా, హైదరాబాద్లో రెడ్డిగా చెలామణి అవుతున్నాడని, ఆయనో బూర్జువా నాయకుడని దుయ్యబట్టారు. ఈటల భండారమంతా బయటపెడ్తామని, గడపగడపకూ ఆయనేంటో చెప్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, జమ్మికుంట అర్బన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజ్కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.