పథకంపై బీజేపీ అసత్య ప్రచారం
ఈటల, బండికి కడుపు మండుతోంది
ఫిర్యాదులు, ధర్నాలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు
ఆరునూరైనా చిత్తశుద్ధితో అమలు చేస్తాం
l16న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు
25 రోజుల్లో 21వేల కుటుంబాలకు లబ్ధి
అమలైతే ప్రతిపక్షాలకు పుట్టగతులుండవ్
జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట, ఆగస్టు 13 : దళిత వ్యతిరేకి భారతీయ జనతాపార్టీ అని, దుర్మార్గమైన పార్టీకి ఇకడ స్థానం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరొన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 11, 27వ వార్డులో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి శుక్రవారం మంత్రి పర్యటించారు. స్థానిక కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు పరిషార మార్గాలు చూపారు. కాలనీకి చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దళితులకు మేలు చేసేందుకు దళితబంధును సీఎం కేసీఆర్ ప్రవేశపెడితే ఆ పథకాన్ని ఆపేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకంపై అసత్య ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి ఈటల రాజేందర్, బండి సంజయ్కి కడుపు మండుతున్నదని విమర్శించారు. ఈసీకి ఫిర్యాదు చేయడం, ధర్నాలు చేయండని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితబంధును ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారని, ఆరు నూరైనా పథకాన్ని అమలు చేసి తీరుతామన్నారు. 20 నుంచి 25 రోజుల్లోగా 21 వేల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి ఖాతాలో జమ అవుతాయని స్పష్టం చేశారు. దళిత బంధు అమలైతే ప్రతిపక్షాలకు పుట్టగతులుండవన్నారు. ప్రజలు అప్రమత్తమై బీజేపీ కుట్రలను విచ్ఛిన్నం చేయాలని, పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని, ఉప ఎన్నికలోగా పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
దళితబంధుపై అపోహలొద్దు..
దళిత బంధు పథకంపై ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు నివాసంలో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు వ్యక్తులు పనిగట్టుకొని పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పథకం అమలును చిత్తశుద్ధితో పూర్తి చేసేందుకు ప్రభుత్వం సమయాత్తమవుతున్నదన్నారు. ఈ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ పార్టీ అర్బన్ శాఖ అధ్యక్షుడు రాజ్కుమార్, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులున్నారు.