పోలీస్ సేవా పతకాలను ప్రకటించిన సర్కారు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44మంది ఎంపిక
11 మందికి ఉత్తమ సేవా.. 33 మందికి సేవా పతకాలు
అభినందించిన పోలీస్బాస్లు
రాంనగర్, జూన్ 2 : తెలంగాణ ఆవిర్భావోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సేవా పతకాలను ప్రకటించింది. అత్యుత్తమ సేవలందించిన పోలీస్ అధికారులకు, పోలీసులను ఎంపిక చేస్తూ బుధవారం జీవో జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44మంది ఎంపికయ్యారు. అందులో 11 మందికి ఉత్తమ సేవా పతకాలు, 33 మందికి సేవా పతకాలు వరించగా, వీరిని పోలీస్బాస్లు అభినందించారు. కరీంనగర్లో సీపీ కమలాసన్రెడ్డి, పెద్దపల్లిలో రామగుండం సీపీ సత్యనారాయణ, డీసీపీ పులిగిల్ల రవీందర్, ఏసీపీలు ఉమేందర్, సారంగపాణి, నిఖితాపంత్, జగిత్యాలలో సింధూశర్మ, జిల్లా అడ్మిన్ ఎస్పీ కే సురేశ్ కుమార్, సిరిసిల్లలో ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు. విధి నిర్వహణలో కష్టించి పనిచేస్తే గుర్తింపు దానంతట అదే వస్తుందని చెప్పారు.
పదకొండు మందికి ఉత్తమ సేవా పతకాలు..
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్లుగా పని చేసి ఏసీపీలుగా పదోన్నతులు పొందిన విజయ్కుమార్, రత్నపురం ప్రకాశ్, మహేశ్గౌడ్తోపాటు పీటీసీలో పని చేస్తున్న డీఎస్పీ రాగ్యానాయక్, ఎస్ఐ కే ముకుందర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పీ రవీందర్బాబు రాష్ట్ర పోలీస్ ఉత్తమ సేవా పథకం కేటగిరిలో ఎంపికయ్యారు. వీరితోపాటు రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ షేక్ మహమ్మద్ అలీ, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఏఆర్ఎస్ఐ ఏ శ్రీనివాస్ రెడ్డి కూడా ఎంపికయ్యారు. ఏసీబీ కానిస్టేబుల్ వెంకటస్వామి, ఫైర్ విభాగంలో మానకొండూర్ ఫైర్ ఆఫీసర్ భూదయ్య, కరీంనగర్ ఫైర్మెన్ ముకుందం కూడా ఎంపికయ్యారు.
33 మందికి సేవా పతకాలు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35 మంది ఎంపికయ్యారు. అందులో కరీంనగర్ జిల్లా నుంచి 17 మంది, రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా నుంచి ఏడుగురు, రాజన్న సిరిస్లిల జిల్లా నుంచి ఆరుగురు, జగిత్యాల జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సీఐడీ ఎస్ఐ టీ గంగారాం, ఎఆర్ ఎస్ఐ ఎండీ జమీల్, ఎస్ రాంమోహన్రావు, శాంతి భద్రతల విభాగానికి సంబంధించి సీఐ జే సురేశ్, టీ విజయమణి (ఏఎస్ఐ), కృష్ణమాచారి, ప్రభాకర్రావు, అంజయ్య, మల్లయ్య (హెడ్ కానిస్టేబుళ్లు), బీ రమేశ్, కే శ్రీనివాస్, టీ మహేశ్, డీ నరేందర్, వై జనార్దన్, డీ సాయిబాబు, జే సదానందం, రాజయ్య (కానిస్టేబుళ్లు) ఎంపికయ్యారు.
రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా మంథని ఏఎస్ఐ సీహెచ్ లక్ష్మీనారాయణ, సుల్తానాబాద్ ఏఎస్ఐ పీ లక్ష్మీనారాయణ, కాల్వశ్రీరాంపూర్ కానిస్టేబుల్ పీ చేరాలు, ఎన్టీపీసీ ఏఎస్ఐ సీహెచ్ చక్రపాని, ధర్మారం కానిస్టేబుల్ జీ భూమయ్య, రామగిరి కానిస్టేబుల్ కే దేవయ్య కానిస్టేబుల్, గోదావరిఖని వన్టౌన్ కానిస్టేబుల్ సదయ్య ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్ఎస్ఐ మహ్మద్ సలీం, ఏఆర్ఎస్ఐ మహ్మద్ అబ్దుల్, ఐటీసెల్ విభాగంలోని కానిస్టేబుల్ ఎం వెంకటరాములు, రుద్రంగి ఠాణాలోని హెడ్ కానిస్టేబుల్ జే రవికుమార్, వీర్నపల్లి ఠాణాలోని కానిస్టేబుల్ ఎన్ మహేందర్రెడ్డి, వేములవాడ టౌన్ పీఎస్ కానిస్టేబుల్ కే కనకయ్య ఎంపికయ్యారు.