తడిసిన ధాన్యాన్నీ
కొంటాం
అన్నదాతలు ఆందోళన వద్దు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులను అప్రమత్తం చేశాం
కొనుగోళ్ల కోసం సీఎం ఇప్పటికే రూ.15వేల కోట్లను సమకూర్చారు
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అకాల వర్షాల వల్ల తడిసే ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. అకాల వర్షాల ప్రభావం అన్నదాతలపై పడకుండా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పౌరసరఫరాల శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించే 80 లక్షల టన్నులే కాకుండా.. ఎంత ధాన్యం వ చ్చినా ప్రభుత్వం సేకరించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపాదిత 7,183 కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికే 6,144 సెంటర్లు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరాలను బట్టి ప్రాధాన్యతా క్రమంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా క్షేత్రస్థాయిలో అధికారులే నిర్ణ యం తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. 14.73 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉ న్నాయని, ముఖ్యమంత్రి ముందు చూపు వల్ల గన్నీ బ్యాగుల కొరత లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లకు అవసమైన రూ.15 వేల కోట్లను ముఖ్యమంత్రి ఇప్పటికే కేటాయించారని పేర్కొన్నారు. అకాల వర్షాల విషయమై ఇప్పటికే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను అప్రమత్తం చేశామని చెప్పారు. కొ నుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యం గింజ నూ కొనుగోలుచేస్తామని పేర్కొన్న మంత్రి.. ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభు త్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని, ఇది రైతు ప్రభుత్వమని, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నా రు. ఈ యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకోవడానికి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అంగీకరించిందని, అంతకుమించి వ చ్చినా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సి ద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు 1.40 లక్షల మంది రైతుల నుంచి రూ.3,740 కోట్ల విలువైన 19.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేశామన్నారు. కరోనా సమయంలోనూ క్షే త్రస్థాయిలో పౌరసరఫరాల సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని మంత్రి పేర్కొన్నారు.