అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం జిల్లాకు రానున్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 3గంటలకు ముస్తాబాద్కు చేరుకుంటున్నారు. తర్వాత మండల కేంద్రంలో రోడ్షోలో పాల్గొంటారు. అమాత్యుడి పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.
-రాజన్న సిరిసిల్ల, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ)