కమాన్చౌరస్తా, మే 26 : జిల్లా కేంద్రంలోని రజ్వీ చమాన్లో లక్ష్ ఇంటర్నేషనల్ సూల్ ఐదో బ్రాంచ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి సీనియర్ స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ టీపీ శశికుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, విజయ రమణారావు, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, ట్రస్మా రాష్ట్ర గౌరవ సలహాదారు యాదగిరి శేఖర్ రావు హాజరై లక్ష్ విద్యాసంస్థల అధినేత ముస్తాక్ అలీతో కలిసి నూతన బ్రాంచ్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యను విద్యార్థులకు చేరువ చేసే ప్రయత్నంలో ప్రయోగాత్మక విద్య అందించాలని సూచించారు. ఇక్కడ సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత దాసరి శ్రీపాల్ రెడ్డి, ఐవీవై ఇంటర్నేషనల్ సూల్స్ అధినేత పసుల మహేశ్, ట్రస్మా నాయకుడు సురేందర్, పురాణం మహేశ్వర్ శర్మ, మప్తి ఘయాజ్ మోసిన్ మౌలానా ఖాజా కలీముద్దీన్, ముస్లి అలీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.