Fish food Festival | ఫిష్ అప్పడాలు, ఫిష్ కట్లేట్, ఫిష్ రోల్, ఫిష్ సమోసా, ఫిష్ ఫ్రై, ఫిష్ బర్గర్, ఫిష్ పకోడి, ఫిష్ బిర్యానీ, ఫీతల ఫ్రై, ఫ్రాన్స్ పకోడి.. ఇదేదో హోటల్ మెనూ అనుకుంటున్నారా..? కానే కాదు. రాష్ట్ర ప్రభుత్వం, మహిళా మత్స్య సహకార సొసైటీల భాగస్వామ్యంతో త్వరలోనే నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్లోని వెరైటీలు. చేపలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వంటల్లో రకాలు తెలియజేసేందుకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా వచ్చే నెల 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఈ వంటకాల పండుగ నిర్వహించబోతున్నది. మత్స్యకారులే కాదు.. ఇతరులెవరైనా స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు మత్స్యశాఖ ఆహ్వానిస్తున్నది. ఈ నెల 30వ తేదీలోగా తమ పేర్లను జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచిస్తున్నది.
– పెద్దపల్లి, మే 28(నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, మే 28(నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా ప్రభుత్వం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ 8 నుంచి 10 వరకు పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుగనున్నది. 20 వరకు ప్రత్యే క స్టాళ్లను ఏర్పాటు చేసి, నోరూరించే చేపల వంటకాలు, సాంప్రదాయక రుచులు, సీ ఫుడ్, ఎండు చేపలు, రెడీ టూ ఈట్ ఫిష్ను అందుబాటులో ఉంచనున్నారు. ఫెస్ట్ ద్వారా ప్రజలకు చేపల వం టకాలపై అవగాహన పెంచడంతో పాటు ఆరో గ్యం కోసం ఏఏ చేపల ఆహారం తీసుకోవాలో వి వరిస్తారు. చేపల ఉత్పత్తులు, వినియోగంపై తీసు కోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు.
మహిళా సొసైటీల భాగస్వామ్యం
జిల్లాలో 1054 చెరువులు ఉండగా, 11, 366 మందితో 144 మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీలు ఉండగా, 1446 మంది సభ్యులతో 33 మహిళా సహకార సంఘాలున్నాయి. ఫుడ్ ఫెస్టివల్లో ఈ సొసైటీలను భాగస్వామ్యం చేస్తూ వివిధ రకాల వంటకాలు తయారు చేయించనున్నారు. ఈ మేరకు వీరికి శిక్షణ కూడా ఇచ్చారు. అలాగే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఫెస్టివల్లో స్టాల్స్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే అవకాశం కల్పిస్తారు. నోరూరించే ఫిష్ వంటకాలతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సాంసృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శించనున్నారు.
చేపలతో ఆరోగ్యానికి ఎంతో మేలు
ఫిష్లో క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి న్యూట్రియంట్స్ పుష్కలంగా లభిస్తాయి. రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్, ఐసోల్యూసిన్ వంటి అమైనో ఆమ్లాలు దొరుకుతాయి. చేప కొవ్వు ఈజీగా అరిగి శక్తి వస్తుంది. చేపల్లో ఉన్న కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్స్ బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. ఒమెగా3 కొవ్వు ఆమ్లాలలోని డీహెచ్ఏ (డై హైడ్రాక్సీ అసిటోన్), ఈపీఏ (ఇకోసపెంటనోయిక్ యాసిడ్, వంటివి కంటి చూ పును, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చేపల్లో పాలీ అన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. అం దుకే గుండె సంబంధ వ్యాధులు, ఆస్తమా, మధుమేహం ఉన్నవాళ్లని చేపలు తినమని డాక్టర్లు చెబుతుంటారు. చేపలు తింటే పెద్దపేగు మలద్వారా క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. విటమిన్-1, డీ, ఈ, కే, ఫాస్పరస్ శరీరానికి అందుతాయి. రక్తం లో హిమగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఎముకలు ధృఢంగా తయారవుతాయి. గర్భిణులు చేపలు తింటే ఇమ్యూనిటీతో పాటు, పిల్లల నాడీ వ్యవస్థ డెవలప్ అవుతుంది. చంటి పిల్లల తల్లులకు పాలు బాగా వస్తాయి.
చేపలతో పసందైన వంటకాలెన్నో..
చేపలు అనగానే చేపల ఫ్రై లేదా పులుసు మా త్రమే చేసుకోవచ్చనే అభిప్రాయం చాలా మంది లో ఉంటుంది. అయితే నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు రకరకాల వంటకాలు రుచి చూస్తున్నప్పటికీ ఇంకా తెలియని, కొత్త రుచులు ఇక్కడి స్టాల్స్లో ఉంచనున్నారు. ఫిష్ బిర్యానీ, ఫీతలఫ్రై, ఫిష్ అప్పడాలు, ఫిష్ కట్లేట్, చేపల పులుసు, ప్రాన్స్ ఫ్రై, ఫిష్ రోల్, ఫిష్ సమోసా, ఫిష్ ఫ్రై, ఫిష్ బర్గర్, ఫిష్ పకోడి, స్మోక్డ్ ఫిష్, ప్రాన్స్ పకోడి.. ఇలా ఏకంగా 20 నుంచి 30 రకాల వంటకాలను ప్రదర్శించనున్నారు. అలాగే చేపల రకాలు, ఆరోగ్యంపై కూడా అవగాహన కల్పిస్తారు. చేపలను ఏ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయో వివరిస్తారు. వలలతో చేపలు పట్టే విధానాన్ని కూడా తెలియజేస్తారు.
స్టాల్స్ ఏర్పాటుకు ఆహ్వానం
జిల్లాలో మత్స్యకారులతోపాటు ఇతరులకు సైతం ఫెస్టివల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఇందుకుగాను 30లోగా పేర్ల ను జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. వివరాలకు 9966225646 నంబర్లో సంప్రదించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి జరుపుల భాస్కర్ తెలిపారు.
జిల్లాలో ఇదే ఫస్ట్ ఫిష్ ఫుడ్ ఫెస్ట్
ఇప్పటి వరకు హైదరాబాద్, వరంగల్లో మాత్రమే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించేవారు. కానీ, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, మృగశిర కార్తె సందర్భంగా తొలిసారిగా పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్నారు. మ హిళా మత్స్యసహకార సంఘాలకు ఇప్పటికే పలు మార్లు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత చేపల ఉత్పత్తి పెరిగింది. ఈ మధ్యకాలంలో ఫిష్తో రుచికరమైన అనేక రకాల వంటలు అందుబాటులోకి వచ్చా యి. వీటి గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.
– ఏరువ సునీత,
మహిళా మత్స్యసహకార సంఘం రామగుండం విజయవంతం చేయాలి..
చేపలతో వివిధ రకాల వంటలు, కలిగే ప్ర యోజనాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకే ప్రభుత్వం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నది. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తెను పురస్కరించుకొని ఈ ఫెస్ట్ను నిర్వహిస్తున్నాం. వివిధ రకాల చేపలు వంటకాలను రుచి చూపించడంతో పాటు వాటిని పరిచయం చేస్తాం. 20 వరకు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాం. జిల్లాలోని మహిళా మత్స్యశాఖ సహకార సొసైటీల ను భాగస్వా మ్యం చేస్తున్నాం. ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వస్తే వారికీ స్టాల్స్ను కేటాయిస్తాం.
– భాస్కర్, మత్స్య శాఖ జిల్లా అధికారి