జిల్లాలో సెస్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ శ్రేణులు ఆదివారం ఇంటింటికీ వెళ్లి.. ఓట్లు అభ్యర్థించారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. మంత్రి కేటీఆర్ సహకారంతో విద్యుత్ సమస్యలు పరిష్కరించుకుందామని సూచించారు. పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని సెస్ కార్యాలయంపై గులాబీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.
ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 18: విద్యుత్ సమస్య ల పరిష్కారానికి బీఆర్ఎస్ అభ్యర్థి వర్స కృష్ణహరి చిత్తశుద్ధితో కృషి చేస్తారని జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. ఆదివారం మండల కేం ద్రంతోపాటు బండలింగంపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఇక్కడ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఎంపీపీ పిల్లి రేణుక, సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అందె సుభాష్, నాయకులు గుళ్లపల్లి నర్సింహారెడ్డి, పందిళ్ల పరశురాములు, గంట అంజాగౌడ్, బండారి బాల్రెడ్డి, నంది కిషన్, మేగి నర్సయ్య తదితరులు ఉన్నారు.
వేములవాడ, డిసెంబర్ 18: మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు సహకారంతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని సెస్ బీఆర్ఎస్ అభ్యర్థి నామాల ఉమ పేర్కొన్నా రు. ఆదివారం పట్టణంలోని మార్కండేయనగర్ 25వ వార్డులో కౌన్సిలర్ గూడూరి లక్ష్మి, మధు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. బ్యాటు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిప ల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, పార్టీ పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు, కౌన్సిలర్లు గూడూరి లక్ష్మి, సిరిగిరి రాంచందర్, ఏఎంసీ డైరెక్టర్లు కమలాకర్రెడ్డి, చేపూరి రవి, భావనరుషి సేవా సంఘం అధ్యక్షుడు కొక్కుల వేణు, నాయకులు గూడూరి మధు, పోలాస నరేందర్, పీచర భాస్కర్రావు, వాసాల శ్రీనివాస్, సనుగుల సత్యం పాల్గొన్నారు.
సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 18: బీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ అందించాలని రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన తంగళ్లపల్లి మండలం తాడూ రు, పాపయ్యపల్లెలో టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల టౌన్-2 అభ్యర్థి దార్నం లక్ష్మీనారాయణతో కలిసి ప్రచారం చేశారు. గ్రామాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి దార్నం లక్ష్మీనారాయణ గుర్తు టెంకాయకు ఓటేసి గెలిపించాలని కోరారు. గోపాలరావుపల్లెలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారం చేశారు. కార్యక్రమా ల్లో మీరాల భాస్కర్యాదవ్, ఏసీరెడ్డి రాంరెడ్డి, సురభి నవీన్రావు, నక్క కొమురయ్య, ఎంపీటీసీ ములిగే దుర్గాప్రసాద్, రాజేశ్వర్రావు, రంగు శ్రీనివాస్, మీరాల శ్రీనివాస్యాదవ్, ఎడ్ల రవి, నూనె కిషన్, సతీశ్ తదితరులు ఉన్నారు.
తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లె, మల్లాపూ ర్, భరత్నగర్, ఇందిరానగర్లో బీఆర్ఎస్ తంగళ్లపల్లి సెస్ డైరెక్టర్ అభ్యర్థి చిక్కాల రామారావు ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ.. ప్రజల ను పలుకరిస్తూ.. వారి సమస్యలు వింటూ.. ఓట్లు అభ్యర్థించారు. తనకు కేటాయించిన బీరువా గుర్తుపై ఓటేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు గజభీంకా ర్ రాజన్న, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, రజక సంఘ జిల్లా అధ్యక్షుడు దు బ్బాక రమేశ్, పడిగెల రాజు, సర్పంచులు నకీర్తి బాలమల్లు, పరశురాములు, నాగరాజు, ఎంపీటీసీ గుగ్గిళ్ల ఆంజనేయులు, రవీందర్రావు, ఉప సర్పంచులఫోరం మండలాధ్యక్షుడు పెద్దూరి తిరుపతి, గనప మదన్రెడ్డి, రాజిరెడ్డి, రెడ్డి పరశురాము లు తదితరులు ఉన్నారు.
ఇల్లంతకుంట, డిసెంబర్ 18: ప్రజలకు అందుబాటులో ఉంటూ.. పని చేసే వారికే సెస్ ఎన్నిక ల్లో పట్టం కట్టాలని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి సూచించారు. ఆదివారం వారు పలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి మల్లుగారి రవీందర్రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఇక్కడ ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, పీఏసీఎస్ చైర్మన్ రోండ్ల తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ప్రశాంత్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ రూరల్, డిసెంబర్ 18: బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల దేవరాజుకు మద్దతుగా ఆదివారం ఆయన జయవరం, మర్రిపెల్లిలో ప్రచారం చేశారు. ఇక్కడ మండలాధ్యక్షు డు గోస్కుల రవి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు ఏశ తిరుపతి, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, సర్పంచులు కట్కం మల్లేశం, తిరుప తి, ఏఎంసీ వైస్ చైర్మన్ బాల్రెడ్డి, ఎంపీటీసీ తిరుపతి, నేతలు కోలె అంజిబాబు, మధు, పిట్టల వెంకటేశ్, బాలకృష్ణ, ప్రవీణ్ తదితరులు ఉన్నా రు. అలాగే వేములవాడ అర్బన్ మండలం కొడుముంజలో బీఆర్ఎస్ అభ్యర్థి రేగులపాటి హరిచరణ్రావుకు మద్దతుగా నాయకులు ప్రచారం చేపట్టారు. ఇక్కడ జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ, వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, నాయకులు భూమడ్ల లక్ష్మణ్, రాజశేఖర్ ఉన్నారు.
చందుర్తి, మండల కేంద్రంతోపాటు, మల్యాలలో సెస్ బీఆర్ఎస్ అభ్యర్థి పొన్నాల శ్రీనివాస్రావు, నాయకులతో కలిసి ప్రచారం చేశారు. గ్రామంలోని యాదవ సంఘం సభ్యులను కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా ల గురించి వివరించారు. బ్రష్ గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మల్యాల సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, వైస్ఎంపీపీ మందాల అబ్రహం, కో ఆప్షన్ సభ్యుడు బతు ల కమలాకర్, ఏఎంసీ డైరెక్టర్ నగరం శంకర్, మొగిలి రవి, ఈర్లపల్లి రాజు పాల్గొన్నారు.
సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 18: పెద్ద మనసుతో తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ తం గళ్లపల్లి సెస్ డైరెక్టర్ అభ్యర్థి చిక్కాల రామారావు కోరారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం సెస్ ఎన్నికల కార్యాలయాన్ని రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ చైర్మన్ గూ డూరి ప్రవీణ్తో కలిసి ప్రారంభించారు. చీటి నర్సింగరావు మాట్లాడుతూ, రామారావును భారీ మెజార్టీలో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థులను పట్టం కట్టాలని జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ, సెస్ కార్యాలయంపై గులాబీ జెండా ఎగురవేసేలా కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సెస్ డైరెక్టర్ ఎన్నిక కోసం మండల ఇన్చార్జిలను ప్రకటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, ఎంపీపీ పడిగెల మానస, మండల కన్వీనర్ కొమ్మెటి రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్లు బండి దేవదాస్గౌడ్, కోడూరి భాస్కర్గౌడ్, సర్పంచుల ఫోరం జిల్లా, మండలాధ్యక్షులు మాట్ల మధు, వేణుగోపాలరావు, నాయకులు పుర్మాణి రాంలింగారెడ్డి, పడిగెల రాజు, దడిగెల శ్రావణ్రావు, అవధూత మహేందర్, సిలువేరి సంజీవ్, దొంతినేని చంద్రారావు, పెద్దూరి తిరుపతి, పృథ్వీధర్రావు, వెంకట్రావు, రాజేశ్వర్రావు, పబ్బతి విజేందర్రెడ్డి, కొత్త సంతో ష్, అబ్బాడి అనిల్రెడ్డి, కోడి అంతయ్య, ఎగు మామిడి వెంకటరమణారెడ్డి, నులుగొండ శ్రీని వాస్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.
గంభీరావుపేట, డిసెంబర్ 18: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నా రు. సెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ గంభీరావుపేట అభ్యర్థి గౌరినేని నారాయణరావుతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొండూరి మాట్లాడుతూ, సెస్ను విలీ నం చేయాలని గతంలో ప్రతిపాదనలు వచ్చి నా, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచకొని మంత్రి కేటీఆర్ సంస్థను విలీనం చేయలేదన్నారు. మంచి పాలకవర్గం కోసం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్బాబు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్ అభ్యర్థులను బరిలో దించారని వివరించారు. కొబ్బరికాయ గుర్తుకు ఓటు వేసి మద్దతునివ్వాలని కోరారు. అంతకు ముందు మల్లారెడ్డిపేటలో శ్రీ వీరాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, పీఏసీఎస్ చైర్మన్ భూపతి సురేందర్, ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాల వ్వ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కమటం రాజేందర్, ఆర్బీఎస్ కన్వీనర్ రాజేందర్, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్రెడ్డి, దయాకర్రావు, కమ్మరి రాజా రాం, చెవుల మల్లేశం, శెట్టి రవి, లక్కిరెడ్డి కమలాకర్రెడ్డి, కూర సురేశ్ పాల్గొన్నారు.
Intense