కార్పొరేషన్, జూలై 15: కరీంనగర్లో మానే రు నదిపై చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ను విదేశీ టూరిస్టులను సైతం ఆకర్షించేలా ఉండాలని, ఆ మేరకు పనులు కూడా చేయాలని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ సూచించారు. శనివారం సాయంత్రం కొండగట్టు పర్యాటన అనంతరం నగరంలోని కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ రివర్ ఫ్రంట్లో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులను ఎంపీ, మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి వివరించారు. ఇందులో బిగ్ ఓ ఫౌంటెయిన్తోపాటు బోటింగ్, థీమ్ పార్కులు తదితర వాటిపై ఎంపీకి వివరించారు. దీనిపై ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడుతూ, అద్భుతమైన విజన్తో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని, భ విష్యత్తులో కరీంనగర్ మంచి పర్యాటక కేంద్రం గా మారుతుందన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ శేరి సు భాష్రెడ్డి, మేయర్ వై సునీల్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్కుమార్గౌడ్, బీఆర్ఎస్ నగ ర అధ్యక్షుడు హరిశంకర్, మార్కెట్ కమిటీ చైర్మ న్ మధు, కార్పొరేటర్ వాల రమణారావు, బీఆర్ఎస్ నేత వీర్ల వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.