Jagityal | జగిత్యాల, ఆగష్టు 4 : సాధారణ తనిఖీలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదాంను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బీ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతీనెల ఈవీఎంలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు.
గోడౌన్లోని యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. గోదాం వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో జిల్లా అదనపు కలెక్టర్ బీ ఎస్ లత, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.