మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఎమ్మెల్యే విద్యాసాగర్రావు వినతి
మెట్పల్లి, జనవరి 21: మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి అర్హులైన నిరుద్యోగ యువతకు అందించే సబ్సిడీ రుణాల యూనిట్ల సంఖ్యను పెంచాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కోరారు. శనివారం ఈ మేరకు మైనార్టీ నాయకులతో కలిసి మంత్రికి వినతిపత్రం అందించారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా మైనార్టీలు ఉన్న నియోజకవర్గం తమదని, ఇటీవల మంజూరు చేసిన యూనిట్లతో పాటు మరిన్ని యూనిట్లను కేటాయించడం వల్ల మైనార్టీ యువతకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రికి విన్నవించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ జడ్పీ ఉపాధ్యక్షుడు హరిచరణ్రావు, మైనార్టీ నాయకుడు జకీర్ ఉన్నారు.