కరీంనగర్ విద్యానగర్, ఫిబ్రవరి 28: వైద్య వృత్తిపై దాడులు చేయడమేంటని ఐఎంఏ, తానా వైద్యులు ఆగ్రహించారు. వైద్యులు, సిబ్బందిపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ శనివారం నల్ల రిబ్బన్లు ధరించి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కరీంనగర్ సీపీ గౌష్ఆలంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ మాట్లాడుతూ, ఆరు నెలల శిశువు మృతి చెందిందనే కారణంతో ఒక వైద్యుడిపై వందిలాది మంది దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.
రోగుల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా వైద్యులు పని చేస్తారని.. ప్రాణాలు తీయాలనే ఉద్దేశం ఎప్పటికీ ఉండదన్నారు. తానా జిల్లా అధ్యక్షుడు ఎనమల్ల నరేశ్ మాట్లాడుతూ, సమాజంలో ఇలాంటి అమానుష సంఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమన్నారు. ఇలాంటి ఘటనలతో వైద్యుల ఆత్మైస్థెర్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. నిరసన కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్ మహేశ్, కోశాధికారి డాక్టర్ నీలిమ, వైద్యులు విజయేందర్రెడ్డి, బీఎన్ రావు, సురేశ్, గంగాధర్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ రాజుకుమార్, స్రవంతి, స్వప్న, రామ్మోహన్, రఘునాథ్, శ్రీలత, మోహన్రెడ్డి, ఝాన్సీ, హిమబిందు, విజయ్కుమార్, కృష్ణమూర్తి, వేణుగోపాల్, శివకుమార్, రవికాంత్, జే సురేష్కుమార్, జ్యోతి, తాత్విక, శ్రీలక్ష్మీ, శ్రవణ్, జాదవ్, సుధీర్, సునీల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.