తిమ్మాపూర్/ తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 15 : కాంగ్రెస్ పార్టీవన్నీ బూటకు హామీలని, ఆ పార్టీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మితే అంతా ఖతమేనని మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దుయ్యబట్టారు. ఈ మేరకు బుధవారం మండలంలోని పోలంపల్లి, మల్లాపూర్, నర్సింగాపూర్ గ్రామాలు, రాత్రి రామకృష్ణకాలనీ, పర్లపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మితే మోసపోతామని, వెలుగులు నింపే బీఆర్ఎస్ కావాలా? చీకట్లు తెచ్చే కాంగ్రెస్ కావాలా? ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. 60 యేండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు కొనితెచ్చుకోవడమేనని సూచించారు. రైతుబంధు, రుణమాఫీ ఆపాలని చూసిన కాంగ్రెస్ నాయకులకు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు రాగానే కవ్వంపల్లి గ్రామాల్లోకి వస్తున్నాడని, కరోనా సమయలో ఎందుకు రాలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఊళ్లలో తిరుగుతున్నాడని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. తాను అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదించాలని, ఈ నెల 20న సీఎం కేసీఆర్ హాజరవుతున్న ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు, కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మల్లాపూర్ పోలంపల్లి, నర్సింగాపూర్ సర్పంచులు, ఎంపీటీసీలు మామిడి సతీశ్, బుజ్జ తిరుపతి, తోట మమత మధు, పుప్పాల కనకయ్య, గట్టుదుద్దెనపల్లి సహకార సంఘం చైర్మన్ అనభేరి రాధాకిషన్రావు, ఆత్మ కమిటీ చైర్మన్ అశోక్రెడ్డి, గుజ్జుల రవీందర్రెడ్డి, మీసాల అంజయ్య, ముప్పిడి సంపత్రెడ్డి, కిన్నెర సారయ్య, ప్రణీత్రెడ్డి, సంపత్రెడ్డి, రాజేశ్ పాల్గొన్నారు.