హుజూరాబాద్టౌన్, నవంబర్ 7 : అతడికి చిన్ననాటి నుంచే నాణేల సేకరణ అంటే మక్కువ ఎక్కువ. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ యువకుడు సివిల్స్ కోసం సిద్ధమవుతూనే నాణేల సేకరణను హాబీగా మార్చుకున్నాడు. డిజిటల్ యుగంలో తేలియాడుతున్న నేటి తరానికి మన ఘన చరితను అందించడమే లక్ష్యమని చెబుతున్నాడు హుజూరాబాద్కు చెందిన తాటిపాముల రవిచంద్ర. ఇందుకు పలుచోట్ల ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నానని పేర్కొన్నాడు.
హుజూరాబాద్కు చెందిన రవిచంద్ర ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే నాణేల సేకరణపై అభిరుచిని పెంచుకున్నాడు. అప్పుడు తనకు దొరికిన నిజాం కాలం నాటి కాయిన్పై పరిశోధన చేశాడు. క్రమంగా నాణేల సేకరణను హాబీగా మార్చుకున్నాడు. ఉమ్మడి కరీంనగర్లోని కోటిలింగాల, పెద్దబొంకూర్, ధూళికట్ట ప్రాంతంలో అనేక ఆనవాళ్లు దొరికాయి. ఆధునిక ప్రపంచం డిజిటల్ సేవలపైన (ఫోన్ పే, గుగూల్ పే) పైన నడుస్తున్నందున ఇప్పటి పిల్లలకి వీటిపైన అవగాహన కల్పించడం కోసం తన ప్రయత్నమన్నారు. త్వరలో రవిచంద్ర సేకరించిన నాణేలను వివిధ ప్రాంతాల్లో కూడా అవగాహన సదస్సులు (ఎగ్జిబిషన్) పెట్టే ఆలోచనలో ఉన్నాడు. తద్వారా ఆయా చిన్న పిల్లలకు కూడా అవగాహన కలుగుతుంది రవిచంద్ర ఆలోచన. పిల్లలకు కూడా ఇది ఒక అభిరుచిగా మారే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం రవిచంద్ర ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ (యూపీఎస్సీ) ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అలాంటి యువకుడు సమాజానికి చరిత్ర గురించి తెలిపాలన్న సంకల్పంతో తన చిరుప్రయత్నమే నాణేల సేకరణ హాబీ అంటున్నాడు.
సేకరించిన కాయిన్స్..
భారత దేశాన్ని పరిపాలించిన రాజుల కాలంలో చెలమణిలో ఉన్న నాణేలు
హైదరాబాద్ సంస్థాన్ కాలం నాటి నాణం