చిగురుమామిడి, మార్చి 24: మహాత్మా జ్యోతి బాఫూలే, సావిత్రీబాయి ఫూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలను శుక్రవారం ఆయన ఆవిషరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిబా ఫూలే ఎంతో కృషి చేశారని కొనియాడారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం నేటి తరంతో పాటు, రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మహనీయుల అడుగుజాడల్లో యువత నడవాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఉల్లంపల్లి-సుందరగిరి తారు రోడ్డు నిర్మాణానికి రూ. 2.25 కోట్లు, గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 65 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన సుడగోని శ్రీనివాస్ దంపతులను ఎమ్మెల్యే శాలువాతో సతరించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం, క్రీడా ప్రాంగణం, వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు.
పార్లమెంటులో జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏప్రిల్ 11న ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, మారెట్ కమిటీ వైస్ చైర్మన్ రామోజు రజిత, సర్పంచ్ చెప్యాల మమత, ఎంపీటీసీ రాగుల రమేశ్, మారెట్ కమిటీ డైరెక్టర్ కొత్త కైలాసం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, జిల్లా నాయకుడు కనకయ్య గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, పన్యాల శ్యాంసుందర్ రెడ్డి, రామోజు కృష్ణమాచారి, మామిడి అంజయ్య, పెనుకుల తిరుపతి, వీరన్న యాదవ్, సర్పంచులు సన్నిళ్ల వెంకటేశం, జకుల రవి, ముప్పిడి నర్సింహారెడ్డి, బోయిని శ్రీనివాస్, సుద్దాల ప్రవీణ్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.