ఎల్లారెడ్డిపేట, జూలై 18 : ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేందుకు నిర్మించిన చెక్డ్యాంలు ఇటీవల కురిసిన వర్షాలకు పరవళ్లు తొక్కుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో రూ.6కోట్లతో నిర్మించిన చెక్డ్యాం నుంచి మానేరు పరవళ్లు తొక్కుతూ జలపాతాన్ని తలపిస్తున్నది. దీంతో సందర్శకులు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.