వేములవాడ టౌన్ , డిసెంబర్ 11 : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం సెలవుదినం కావడంతో రద్దీగా కనిపించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజాము నుంచే పవిత్ర ధర్మగుండంలో స్నానం చేసి, కోడె మొక్కు చెల్లించుకున్నారు.
కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, తామెత్తు బెల్లాన్ని పంచిపెట్టారు. తర్వాత క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్నను దాదాపు 20 వేలకు పైగా భక్తులు దర్శించుకోగా, సుమారు రూ.14లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.