వేములవాడ టౌన్, నవంబర్ 3: వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం బుధవారం సాధారణ భక్తులతో రద్దీగా కనిపించింది. భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని, కోడెమొక్కులు, అభిషేకపూజలు, అన్నపూజలు, కుంకుమపూజలు, కల్యాణంమొక్కులు, చండీహోమాలు, సత్యనారాయవ్రతాలు నిర్వహించుకున్నారు. రాజన్నను దాదాపు 4 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
8న రాజన్న ఆలయం మూసివేత
చంద్రగ్రహణం ఎఫెక్ట్
సాయంత్రం 6.30 నుంచి దర్శనం
వేములవాడ టౌన్, నవంబర్ 3: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 8న ఉదయం ప్రాతః కాలపూజ అనంతరం రాజన్న ఆలయాన్ని మూసివేస్తామని అధికారులు వెల్లడించారు. చంద్రగ్రహణం పగలు 2.38 నుంచి సాయం త్రం 6.10 గంటల వరకు ఉంటుందని, ఆ టైం లో ఆలయా న్ని మూసివేయడంతో ఎలాంటి దర్శనాలు ఉండవని వా రు తెలిపారు. గ్రహణం విడిచిన తర్వాత సాయంత్రం 6.18 తర్వాత పుణ్యాహవచనం చేసి సంప్రోక్షణ జరిపి, స్వామివారి నివేదన తర్వాత భక్తులు యధావిధిగా దర్శిం చుకోవచ్చని తెలిపారు. కార్తీకపౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహిస్తామని, తర్వాత స్వామివారికి మహాపూజ ఉంటుదని ఆలయ అధికారులు పేర్కొన్నారు.