Vemulawada | వేములవాడ, ఫిబ్రవరి 23 : వాహనదారుడికి హెల్మెట్ భారం కాదని అది ప్రాణాధారమని గమనించాలని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు సోమవారం అవగాహన కల్పించారు. ముందుగా హెల్మెట్ ధరించిన వాహనదారులకు గులాబీ పువ్వు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ హెల్మెట్ భారం కాదని, అది ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని అన్నారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని వారే ఎక్కువ సంఖ్యలో తీవ్ర ప్రమాదాలకు లోనై కుటుంబానికి దూరమవుతున్నారని వివరించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాఫిక్ సీఐ సురేష్, వేములవాడ ట్రాఫిక్ ఎస్సై రాజు తదితరులు ఉన్నారు.