వాహనదారుడికి హెల్మెట్ భారం కాదని అది ప్రాణాధారమని గమనించాలని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు సోమవారం అవగాహన కల్పించారు.
గురుకుల పాఠశాలల్లో పేద బిడ్డల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తున్న తమను కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు.
ఆస్తి పంచివ్వాలని కొడుకు, కూతుర్లు కత్తి, ఇటుకలతో దాడి చేసి తండ్రిని హతమార్చారు. ఈ దాడిలో తీవ్ర గాయాలై పినతల్లి దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటన ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకు�