మానకొండూర్ నియోజకవర్గవ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. ముందెన్నడూ లేనివిధంగా ముంచెత్తింది. రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదవడంతో తడిసిముద్దయింది. జలప్రళయంతో జనజీవనం స్తంభించింది. ఊరూరా వరద ఏరులైపారింది. వరదనీరు చేరికతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు అలుగులు దుంకాయి. అధికారులు అప్రమత్తమై ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎమ్మెల్యే రసమయితో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
తిమ్మాపూర్, మానకొండూర్/ మానకొండూర్ రూరల్/ శంకరపట్నం/ చిగురుమామిడి జూలై 27: నియోజకవర్గ వ్యాప్తంగా రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండు కుండలా మా రాయి. తిమ్మాపూర్ మండలంలో అన్ని గ్రామా ల్లో కుంటలు బుధవారం రాత్రి కురిసిన వర్షానికి నిండాయి. మత్తడులు పడుతున్నాయి. పొరండ్ల పెద్దచెరువు మత్తడి దూకుతున్నది. ప్రవాహంలో గ్రామస్తులు చేపలు పట్టుకున్నారు. ఈ వరద ఉధృతికి పోరండ్ల నుంచితిమ్మాపూర్ వెళ్లే దారి స్తంభించిపోయింది. అలాగే మన్నెంపల్లిలో కెనాల్ తెగిం ది. కెనాల్ వాటర్తో పాటూ వర్షం నీటితో ఇండ్ల న్నీ నీటమునిగాయి. నేదునూర్, గొల్లపల్లి గ్రామాలకు కుంట లు మత్తడి దూకడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే గన్నేరువరం మండలంలో పారువెల్ల, గన్నేరువరం చెరువులు నిండి మత్తడి భారీగా దూకుతున్నది. మైలారం వెళ్లే రోడ్డు కొట్టుకుపోయి రవాణా స్తంభించిపోయిం ది. మండల కేంద్రానికి చెందిన గర్భిణి పురిటి నొ ప్పులతో బాధపడుతుండగా ఎస్ఐ నర్సింహారావు తన వాహనంలో కరీంనగర్ తరలించారు. అటు చొక్కారావుపల్లి వద్ద వాగు ఉధృతి పెరగడంతో ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు పై నుంచి వరద వ స్తుండడంతో మోయతుమ్మెద వాగు ఉప్పొంగుతోంది. ఇరువైపులా ఒడ్డుకు ఆనుకుని ఎల్ఎండీలోకి భారీగా ఇన్ఫ్లో వస్తున్నది. మానకొండూర్ పెద్దచెరువు మత్తడి పడుతుంది. మత్స్యకారులు చేపలు పట్టి కట్ట వద్ద విక్రయిం చారు. లక్ష్మీపూర్-వెల్ది గ్రామాల మధ్యగల రోడ్డు పై, లక్ష్మీపూర్ -లింగాపూర్, లక్ష్మీపూర్-రంగపేట గ్రామాల మధ్య ఉన్న రోడ్లపై నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప చ్చునూర్ పంచాయతీ సమీపంలో వరద ఉధృ తితో రోడ్డు నీట మునిగింది. అన్నారం-రాఘవాపూర్ గ్రామాల మధ్యన గల కల్వర్టు మీదుగా, అ న్నారం-ఈదుల గట్టెపల్లి గ్రామాల మీదుగా ఉన్న రూట్లో సైతం వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇ బ్బం దులు తలెత్తాయి. అన్నారం ఊర చెరువు మత్తడి పడడంతో రంగపేట వాసు లు ఇక్కట్లు పడ్డారు.
ముంజంపల్లి శివారులోని జాలగుట్ట సమీపంలో వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారిపై రావి చెట్టు విరిగిపడ్డది. ట్రాఫిక్ పోలీసులు చెట్టు కొమ్మ లను తోలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. శంకరపట్నం మండలంలో 167.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కేశవపట్నం వాగుకు 40 ఏండ్లలో మూడోసారి అత్యధికంగా వరదనీరు చేరింది. కల్వల ప్రాజెక్టు కట్టకు బుంగ పడ్డది. మత్స్యకారులు, అధికారులు అప్రమత్తమై ఇసుక బస్తాలతో పూడ్చి వేశారు. కేశవపట్నం జడ్పీ ఉన్న త పాఠశాలలోని భారీ వృక్షం కూలి భవనంపై ప డ్డది. అర్కండ్ల వాగులో వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. సీఐ సంతోష్కుమార్, ఎస్ ఐ లక్ష్మారెడ్డి, సిబ్బందితో కలిసి ముళ్ల కంచె వేసి దారిని మూసివేశారు. కేశవపట్నం, కాచాపూర్, క రీంపేట్, రాజాపూర్, మక్త, ధర్మారం, కన్నాపూర్, తదితర గ్రామాల్లోని రహదారులు చెరువులను తలపించాయి.
ఇప్పలపల్లి పంచాయతీ భవనం, స్కూల్లోకి వరద నీరు చేరి చెరువులా మారింది. రాజాపూర్ ఎస్సీ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. మొలంగూర్లోని పలు ఇండ్లలోకి వా ననీరు చేరింది. తాడికల్లో పోస్టాఫీస్, వైకుంఠధామం నీట మునిగాయి. భారీ వర్షాలతో పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరా యం ఏర్పడింది. ఎన్పీడీసీఎల్ సిబ్బంది శ్రమిం చి పునరుద్ధ్దరించారు. ముత్తారం 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ సమీపంలో గల ఒర్రె కోతకు గురవడంతో దిమ్మె కూలిపోయింది. కన్నాపూర్ ఊర చెరువు దిగువన గల 11కేవీ పోలు చెట్టు విరిగి మీద పడడంతో పోలు వంగిపోయింది. అలాగే ముత్తారం లో ఈదురు గాలులకు చెట్టు కొమ్మ విరిగిపడడం తో ఎల్టీ వైర్ తెగి పడినట్లు తాడికల్ విద్యుత్ విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈఈ ఆర్ సంపత్రెడ్డి తెలిపారు. సిబ్బంది వెంటనే సరఫరాను పునరుద్దరించారు. కాగా కన్నాపూర్ కిష్కింధకాండకు చెందిన కిష్కింధ యూత్ సభ్యులు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించారు.
చిగురుమామిడి మండలంలోని చెరువులు మత్తళ్లు దుంకుతూ పరవళ్లు తొక్కుతున్నాయి. రామంచలో మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రామంచలో నిర్మించిన వైకుంఠ ధామం నీట మునిగింది. ఇందుర్తి ఓబులాపూర్ మధ్యగల రహదారిపై ఎల్లమ్మ వాగు ప్రవహిం చడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కరీంనగర్ రూరల్ ఏసీపీ తాండ్ర కరుణాకర్ రావు ఎల్లమ్మ వాగును పరిశీలించారు. రేకొండలో కె నాల్ ద్వారా వరదరావడంతో పంట పొలాల న్నీ జలమలమయ్యాయి. రేకొండ నుండి మొగిలి పా లెం వెళ్లే రహదారి పై వరద భారీగా పెరగడంతో రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. గాగిరెడ్డి పల్లె సంగోజి చెరువు మత్తడి పడడంతో మత్స్యకారులు చేపలు పట్టారు. పలు గ్రామాల్లో తహసీల్దార్ జయంత్, ఎంపీడీవో నర్సయ్య, ఎస్ ఐ సామల రాజేశ్ పరిస్థితులను సమీక్షించారు.