తెలంగాణచౌక్, డిసెంబర్ 8 : టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నేటి (ఈనెల 9వ తేదీ) మధ్యాహ్నం నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని కరీంనగర్ రీజియన్ మేనేజర్ సుచరిత తెలిపారు. ఈ మేరకు సదుపాయాన్ని కల్పిస్తూ యాజమా న్యం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లోని ఆర్ఎం కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. డిపో-2లో శనివా రం ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు.
పల్లెవెలుగు, మినీ పల్లెవెలుగుతోపాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ సౌకర్యం కేవలం తెలంగాణ రాష్ర్టానికి చెందిన మహిళలకు మాత్ర మే వర్తిస్తుందన్నారు. ప్రయాణ సమయంలో మహిళలు రాష్ర్టానికి చెందిన వారుగా ఏదైనా గు ర్తింపు పత్రం చూపించాల్సి ఉంటుందన్నారు. ఉచిత ప్రయాణంలో సమస్యలు ఎదురైతే డిపో మేనేజర్లను సంప్రదించాలని సూచించారు.