ధర్మారం/ధర్మపురి, నవంబర్ 3: ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆగడాలు భరించలేకే తన సోదరుడితో బీఆర్ఎస్లో చేరామని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్ ప్రకటించారు. శుక్రవారం ఆయన సోదరుడు డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల వేణు ఆ పార్టీకి రాజీనామా చేసి ధర్మపురిలోని మంత్రి ఆఫీసులో కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వీరితో పాటు కాంగ్రెస్ కు గోపాల్రావుపేట కనుకుట్ల సుజాత-శ్రీనివాస్రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ జనగామ అంజయ్య, ఉప సర్పంచ్ సంకసాని సతీశ్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సందినేని కొమురయ్య, పార్టీ సలహాకమిటీ మండల సభ్యుడు గాగరెడ్డి రాజేశ్వర్రెడ్డి అధ్వర్యంలో.. చామనపల్లి మాజీ సర్పంచ్ పాలమాకుల ఉపేందర్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. కాగా ధర్మారంలోని బీఆర్ఎస్ ఆఫీసులో పార్టీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్తో కలిసి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు.
పదిహేనేండ్లుగా లక్ష్మణ్కుమార్తో పనిచేశామని, కానీ ఆయన తమను అనేక ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. ఆయన రాజకీయ ప్రయాణంలో స్పష్టతలేదని విమర్శించారు. దళితబంధుపైన రాద్ధాంతం చేశాడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నిన్నటి ప్రజాఆశీర్వాద సభలో ధర్మపురి నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు వర్తింపజేస్తామని చెప్పడం సంతోషకరమన్నారు. ఈ విషయంలో అడ్లూరి లక్ష్మణ్కుమార్ వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. తాము మంత్రి కొప్పుల విజయం కోసం కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు.
కొందరు కాంగ్రెస్ నాయకులు తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాగా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్తో సహా, గోపాల్రావుపేట, చామనపల్లి గ్రామాల మాజీ సర్పంచులు బీఆర్ఎస్లో చేరడంతో హస్తంపార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. సమావేశంలో ప్యాక్స్ చైర్మన్ మ్యుతాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు పూస్కూరు రామారావు,మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫి, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు పాల్గొన్నారు.