Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 4 : మల్లాపూర్ మండల కేంద్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో సతమతమవుతున్నామని ప్రముఖ సామాజిక కార్యకర్త ఏనుగు వెంకటరెడ్డి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కరుణించు కరంట్ ట్రాన్స్ఫార్మర్ అంటూ ట్రాన్స్ఫార్మర్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా అందుబాటులో ఉండాల్సిన విద్యుత్ అధికారులు, సిబ్బంది పట్టణ ప్రాంతాల్లో ఉండడంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. రాత్రి, పగలు సమయాల్లో కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో దేవుడికే తెలుసు అని ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కోరారు .