కరీంనగర్ విద్యానగర్, మార్చి 9 : మెడిసిన్ ధరలను తగ్గించాలని, వాటిపై జీఎస్టీ ఎత్తి వేయాలని సీ నియర్ వైద్యుడు ఎడవెల్లి విజయేందర్రెడ్డి డిమాం డ్ చేశారు. కరీంనగర్లోని పద్మశాలీ కల్యాణ మండపంలో తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ 5వ రాష్ట్ర మహాసభల సమావేశాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ దేశ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. మందుల ధరలు తగ్గించాలని, జీఎస్టీ ఎత్తి వేయాలని, నకిలీ, నాసిరకం మందులు అరికట్టాలని, ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిషేధించాలని చేస్తు న్న పోరాటాలను కొనియాడారు.
అలాగే, ప్రజా సంక్షేమం కోసం మెడికల్ రిప్లు చేసే న్యాయమైన పోరాటాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్వ ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండించారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కే రమేశ్ సుందర్ మాట్లాడుతూ, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్-1976ను పరిరక్షించాలని, మెడికల్ రిప్రజంటేటివ్స్కి చట్టబద్ధమైన పని విధానాలను కల్పించాలని, నాలుగు లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని కోరారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జీ వెంకట్రెడ్డి మాట్లాడుతూ, మందుల రంగంలో జరుగుతున్న అనైతిక కార్యక్రమాలను ఉమ్మడి పోరాటాలతో అరికట్టాలని సూచించారు. మెడికల్ రిప్రజంటేటివ్స్ సమస్యల పరిషారం కోసం ఐఎం ఏ తరఫున పూర్తి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. టీఎంఎస్ఆర్యూ జనరల్ సెక్రటరీ రాజు భట్ మాట్లాడుతూ, ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపి వేయాలని, మందులు మందుల పరికరాలపై జీరో శాతం జీఎస్టీ విధించాలని కోరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమే శ్ మాట్లాడుతూ, కరోనా సమయములో మెడికల్ రిప్స్ ప్రజల కోసం చేసిన సేవలను కొనియాడారు.